డబ్బులు పోయాయని ... | Sakshi
Sakshi News home page

డబ్బులు పోయాయని ...

Published Mon, Mar 30 2015 8:33 PM

man committed suicide

మిర్యాలగూడ : బస్సులో ప్రయాణిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు దొంగలించడంతో మనస్థాపం చెందిన వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్‌ట్యాంక్ తండా వద్ద సోమవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడకు చెందిన మిట్టపల్లి కృపానందం(50)  ఈ నెల 27వ తేదీన బస్సులో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా తన వద్ద ఉన్న రూ.5లక్షల డబ్బును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీంతో అతను దిల్‌సుఖ్‌నగర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్ వచ్చి వెళ్లిన కృపానందం డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదని పోలీసులు చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. పోయిన డబ్బు తిరిగి దొరుకుతుందో లేదోనన్న అనుమానంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement