మిర్యాలగూడ : బస్సులో ప్రయాణిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు దొంగలించడంతో మనస్థాపం చెందిన వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ట్యాంక్ తండా వద్ద సోమవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడకు చెందిన మిట్టపల్లి కృపానందం(50) ఈ నెల 27వ తేదీన బస్సులో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా తన వద్ద ఉన్న రూ.5లక్షల డబ్బును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీంతో అతను దిల్సుఖ్నగర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్ వచ్చి వెళ్లిన కృపానందం డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదని పోలీసులు చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. పోయిన డబ్బు తిరిగి దొరుకుతుందో లేదోనన్న అనుమానంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.