ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Published Tue, Feb 17 2015 2:54 PM

man commits suicide due to financial problems

రెంజల్(నిజామాబాద్): ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూలెపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కూలెపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య(35) గ్రామ సర్పంచి దగ్గర జీతానికి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో సర్పంచి ఇంటిలోని కొట్టంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం భోదన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement