కామేపల్లి: టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. శనివారం మండల పరిధిలోని కొత్తలింగాల గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బానోత్ నర్సింహానాయక్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కార్యకర్తలు వర్గాలను వీడి పార్టీ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని కోరారు.
ఈ నెల 27న వరంగల్లో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు మండలం నుంచి 5 వేల మంది కార్యకర్తలను తరలించి పార్టీ సత్తాను చాటాలన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించినా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాత్రం అభివృద్ధికే పెద్దపీఠ వేశారన్నారు. అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని, గ్రామాల్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, ఎంపీపీ మాళోత్ సరిరాంనాయక్, సర్పంచులు అరెం రవి, జర్పుల రామోజీ, బి.రాంజీ, ఎంపీటీసీలు హట్కర్ పార్వతి, మాళోత్ రాంచందర్నాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కీసర విష్ణువర్థన్రెడ్డి, ఎస్కె ఫత్తేఅహ్మద్, మూడ్ కృష్ణప్రసాద్, వడియాల కృష్ణారెడ్డి, గ్రామశాఖల అధ్యక్షులు టి.వీరయ్య, కాట్రాల మల్లయ్య, కిషన్, సుంకర బిక్షం, కొనకంచి శంకర్, ఎం.రాంమూర్తి, శీలం పుల్లయ్య, నాయకులు భట్టు శంకర్, జి.నారాయణరెడ్డి, కాట్రాల రాంబాబు, జి.వెంకటరత్నం, డి.భద్రయ్య, చల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం
Published Sat, Apr 22 2017 10:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement