చనిపోయాడనుకున్న వ్యక్తి బతికాడు | Sakshi
Sakshi News home page

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికాడు

Published Wed, Feb 4 2015 6:16 PM

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికాడు

మరిపెడ: చనిపోయాడనుకున్న వ్యక్తి బతికిన సంఘటన వరంగల్ జిల్లా మరిపెట మండలంలోని వీరారం శివారు జీన్యాతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం జీన్యాతండాకు చెందిన రైతు బానోతు ధర్మ తన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయంతో పూడిక తీయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
 
 అక్కడి వైద్యులు ధర్మా చనిపోతాడని.. వైద్యం చేయడం అనవసరం అని చెప్పడంతో కుటుంబ సభ్యులు రోదిస్తూ ఇంటికి తీసుకువచ్చారు. అప్పటికే ధర్మ చనిపోయాడని తండాకు సమాచారం రావడంతో బంధువులు కాడి పేర్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్న క్రమంలో ధర్మ ఒక్కసారిగా లేచి ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిని మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement