మంత్రి కేటీఆర్‌ నయా వీరప్పన్‌.. | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌ నయా వీరప్పన్‌..

Published Tue, Jul 25 2017 1:52 AM

మంత్రి కేటీఆర్‌ నయా వీరప్పన్‌.. - Sakshi

సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ ఫైర్‌
 
సిరిసిల్ల: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నయా వీరప్పన్‌లా వ్యవహరిస్తున్నారని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో పోలీసుల దెబ్బలతో గాయపడిన దళిత కుటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను సిరిసిల్ల వైపు వస్తుంటే పది నిమిషాల్లోనే 40–50 ఇసుక లారీలు కనిపించాయన్నారు.

‘డబుల్‌ బెడ్రూం నిర్మాణాలకు ఇసుక’ అని బ్యానర్లు కట్టి ప్రభుత్వమే ఇసుక మాఫియా నిర్వహిస్తోందన్నా రు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, డ్రగ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా కొనసాగుతున్నాయని అన్నారు. 

Advertisement
Advertisement