35 వేలకు చేరువగా కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

35 వేలకు చేరువగా కరోనా కేసులు

Published Mon, Jul 13 2020 2:53 AM

CoronaVirus: Telangana Record 1269 New Positive Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 35 వేల కు చేరువయ్యాయి. ఆదివారం కొత్తగా 1,269 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది. వీటిలో 11,883 యాక్టివ్‌ కేసు లు కాగా, 22,482 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఆదివారం 8 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 356కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,70,324 పరీక్షలు చేయగా, 1,35, 653 మందికి నెగెటివ్‌ వచ్చింది.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అధికంగా జీహెచ్‌ఎంసీలో 800, రంగారెడ్డి 132, మేడ్చల్‌ 94, సంగారెడ్డి 36, కరీంనగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 23 చొప్పున నమోదయ్యాయి. ఇంకా మహబూబ్‌నగర్‌ 17, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో 15 చొప్పు న, మెదక్‌ 14, వరంగల్‌ అర్బన్‌ 12, నిజామాబాద్‌ 11, పెద్దపల్లి 9, మహబూబాబాద్‌ 8, యా దాద్రి, సూర్యాపేట, గద్వాలలో 7 చొప్పున, వికా రాబాద్, జనగామలో 6 చొప్పున, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్‌లో 4 చొప్పున, మంచిర్యాల, కొత్తగూడెం, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 3 చొప్పున, వరంగల్‌ రూరల్‌లో 2, ఖమ్మంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement