ఎస్‌ఐని ఢీకొట్టి పరార్.. | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐని ఢీకొట్టి పరార్..

Published Fri, Apr 24 2015 5:23 PM

attack on police officer

ఖమ్మం : విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని దుండగులు వాహనంతో ఢీకొట్టి పరారైన సంఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ శివారులో సారాబట్టీలను నడుపుతున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

 

ఈ క్రమంలో సారాను తరలిస్తున్న ఒక వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఎస్‌ఐ సీతారాములును ఢీకొట్టుకుంటూ పరారయ్యారు దుండగులు. దీంతో ఎస్‌ఐ సీతారాములుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement