కార్మికులను ఆసాములుగా మార్చేది ఉండే..
● అపెరల్ పార్క్లో షెడ్లు పూర్తయ్యాయి ● రూ.400 కోట్లతో పనులు చేశాం ● ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించండి ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల: నేతకార్మికులను ఆసాములుగా మార్చేందుకు రూ.400కోట్లతో అపెరల్పార్క్ను నిర్మించామని, ఆధునిక మగ్గాలు ఇవ్వాల్సి ఉండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని శాంతినగర్, గాంధీచౌక్, కొత్త బస్టాండు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన రోడ్షోలలో మాట్లాడారు. ఐదు సార్లు గెలిపించి.. మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించారన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే.. మిగిలిన పనులు పూర్తి చేసేవాడినని స్పష్టం చేశారు. సిరిసిల్లను జిల్లా చేసుకుని, మెడికల్, వ్యవసాయ, నర్సింగ్, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నామని తెలిపా రు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ‘సెస్’ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, అగ్గి రాములు, గుండ్లపల్లి పూర్ణచందర్, బుర్ర నారాయణగౌడ్, కౌన్సిలర్లు రాపెల్లి దినేశ్, గుడ్ల శ్రీనివాస్, దార్నం అరుణ, అ న్నారం శ్రీనివాస్, ఆడెపు సౌజన్య, గడ్డం చందన, గుండ్లపల్లి నీరజ పాల్గొన్నారు.
రైతులతో టెలీకాన్ఫరెన్స్
సిరిసిల్ల నియోజకవర్గంలోని రైతులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కేసీఆర్తోనే రైతు సంక్షేమం సాధ్యమైందని, 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, రైతువేదికలు, కాళేశ్వరం నీళ్లు వచ్చాయన్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందరిని మోసం చేసిందన్నారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని చెప్పి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు రైతులు అండగా ఉండాలని కోరారు. వినోద్కుమార్ జనగొంతుకగా నిలుస్తాడు
ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి గోస పడుతున్నామని.. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలి పిస్తే పార్లమెంట్లో తెలంగాణ జనగొంతుకగా నిలుస్తాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ కా ర్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో 250 మంది రైతులు, ఎందరో నేతకార్మికులు, 50 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తారని, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారన్నారు. ఈనెల 10న సిరిసిల్లలో నిర్వహించే కేసీఆర్ రోడ్షోను విజయవంతం చే యాలని కోరారు. టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఎంపీపీలు శరత్రావు, మా నస, సెస్ చైర్మన్ రామారావు, డైరెక్టర్లు అంజి రెడ్డి, నాయకులు సురేందర్రావు, రాజన్న, గో పాల్రావు, చంద్రశేఖర్రావు, శ్రీనివాస్, మధు, బాపురావు, దేవదాస్, భాస్కర్ ఉన్నారు.