తెలంగాణలో మరో 62 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో 62 కరోనా కేసులు

Published Sun, Apr 5 2020 11:06 PM

62 New Corona Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 334కు చేరుకుంది. కరోనా బారినపడి ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతి చెందారు. 33 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఆసుపత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 145 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరంగల్‌ అర్బన్‌ 23, నిజామాబాద్‌ 19, నల్లగొండ 13, మేడ్చల్‌ 12, ఆదిలాబాద్‌ జిల్లాలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని బులెటిన్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement