-
‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే.. కాంగ్రెస్ సర్కారుకు దెబ్బకు దెయ్యం వదిలి రైతుల ఖాతాల్లో రైతుబంధు (రైతు భరోసా) డబ్బులు వేసిందని చెప్పారు. ఇక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. 12–14 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్లలో కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించి.. నెహ్రూ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేస్తూ వస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా మళ్లీ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అనే పాలసీతో సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతకుమించి చేస్తున్నదేమీ లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్, అంబేడ్కర్ ఓవర్సీస్, సీఎంఆర్ఎఫ్, కేసీఆర్ కిట్లు.. వంటివన్నీ ఆగిపోయాయి. కరెంటు సరిగా రావడం లేదు.. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలన్నీ ఎండబెట్టింది. గోదావరి నీళ్లను మోదీ వేరే రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ అడ్డుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్కు అండగా నిలవాలి.. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారు. అయినా రైతుబంధుకు 5 ఎకరాలకే కటాఫ్ పెట్టడం ఏమిటి? 6, 7 ఎకరాలున్న రైతులు బతకొద్దా? ఇక రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే. తెలంగాణ శక్తి, తెలంగాణ గళం, తెలంగాణ బలం బీఆర్ఎస్సే. 12–14 సీట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చేది ఒక్క తెలంగాణలో మా త్రమే. మోదీ పింఛన్లు ఇవ్వలేదు. బీడీ కార్మీకులంతా బీఆర్ఎస్కు అండగా నిలబడాలి. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేబీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్తున్నారు. కానీ 200లోపే సీట్లు వస్తాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కుమ్మక్కయ్యాయి. అందుకే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెట్టుకున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటున్న నరేంద్ర మోదీ... దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నవోదయ పాఠశాల సైతం ఇవ్వలేదేం? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. ఏం చేశారు? తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? నేను ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన. యావత్ తెలంగాణకు కేసీఆర్ ఆత్మబంధువు. నేను కూడా హిందువునే. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నదే నా అభిమతం. నేను ప్రధాని మోదీని నిలదీసినందుకే.. నా కుమార్తె కవితను జైల్లో పెట్టారు. అయినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదు. గులాబీ జెండాను గుండెలో పెట్టుకోవాలి యువత ఆవేశంగా ఓట్లు వేయకుండా ఆలో చించి ఓట్లేసి బీఆర్ఎస్ను గెలిపించాలి. విద్యు త్, రైతుబంధు సరిగా రావాలన్నా.. మన గోదావరి నీళ్లు మనకే దక్కాలన్నా.. పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నా.. బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ప్రజల మంచి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతాం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ బీఫాం ఇచ్చిన కేసీఆర్నిజామాబాద్ నాగారం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్ రెడ్డికి బీఫాంను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం రాత్రి నిజామాబాద్లో అందజేశారు. నగరంలో రోడ్ షో ముగిసిన అనంతరం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్కు రాకేశ్ రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, నాయకులు మహేశ్ బిగాల, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులుజగిత్యాల క్రైం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్.. సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా చల్గల్ గ్రామశివారులో ఎన్నికల అధికారులు ఆయన బస్సును, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని వారు ప్రకటించారు. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో సోషల్ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు. ఏ అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయ్యిందో ట్విట్టర్ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీడియో మార్ఫింగ్ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు.మార్ఫింగ్ వీడియోను ఫోరెన్సిక్కు పంపించాము. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము. మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం. ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల కోసం ఫుల్ బందోబస్తు..ఇదే సమయంలో ఎన్నికల బందోబస్తు గురించి కూడా వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతాం. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన దాని కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్కి వచ్చాయి. మరిన్ని బలగాలను పంపాలని కోరాం.పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నడుస్తున్నాయి. హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నాయి. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. పోలింగ్ రోజు ఈ టీమ్స్ పనిచేస్తాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుంచి 18 కోట్ల అక్రమ నగదుని ఇప్పటివరకు పట్టుకున్నాం. అలాగే, 12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
అక్కరకురాని సుట్టాలెందుకు.. కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తనకు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. అలాగే, రాముడు అందరి వాడు.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నాం. సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుకున్నాం. మీరు నన్ను ఇక్కడ గెలిపించినా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి విజయం సాధించింది. మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో గెలిచింది.ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి?. అబద్ధాలు చెబితే డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషంలో దొరికిపోతారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నామో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను పట్టుకుని కాంగ్రెస్ నాయకులు అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాక ఒక లెక్క అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు. కేసీఆర్ మళ్లీ కావాలనుకుంటే మే 13వ తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించండి.. తెలంగాణలో శాసించే అధికారం వస్తుంది.బీజేపీ నేతలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. రాముడు అందరివాడు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దేవాలయాలు బీజేపీ పుట్టకముందు నుంచే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నులు వేసి మోదీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మళ్లీ అబ్కీ బార్ 420 అంటున్నాడు. అక్కరకురాని చుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకో జోడీ దారు దొరికితే.. రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ ఆసిఫాబాద్: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, మతపరమైన (ముస్లిం) రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో ఎవరూ రిజర్వేషన్లను తొలగించకుండా చూస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఆర్ఆర్ (రాహుల్గాం«దీ, రేవంత్రెడ్డి) టాక్స్ వసూలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీని అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఆ ఏటీఎంలో డబ్బుల్లేకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలి్పస్తామని నేను ఇటీవల ఓ సభలో చెప్పాను. ఆ వీడియోను ఎడిట్ చేసి మోదీ రిజర్వేషన్లు తొలగిస్తారని అన్నట్టుగా ప్రజల్లో దు్రష్పచారం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రిజర్వేషన్లు తొలగించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లతో విద్యా, ఉద్యోగ అవకాశాలు కలి్పంచింది. మోదీ ఆరి్టకల్ 370ను రద్దు చేశారు, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. రామమందిర నిర్మాణం చేశారు. ఆర్టికల్ 370ను రద్దుచేస్తే కశీ్మర్లో రక్తపుటేరులు పారుతాయని రాహుల్గాంధీ అడ్డుపడే ప్రయత్నం చేశారు. అది చేసి ఐదేళ్లు గడిచిపోయాయి రక్తపుటేరులు కాదు.. కనీసం రాళ్ల దాడి చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే.. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి, ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పారీ్టలు సంతుïÙ్టకరణ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్.. ఈ మూడు పారీ్టలు ఓటుబ్యాంకు కోసం రామనవమి యాత్రకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టాయి. బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కేంద్రంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అయోధ్య సమస్యను పరిష్కరించలేదు. మోదీ ఐదేళ్లలో పరిష్కరించి, రామమందిర నిర్మాణం పూర్తి చేశారు. రామాలయ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానించినా.. ఒకవర్గం ఓట్ల కోసమే రాహుల్గాం«దీ, మల్లికార్జున ఖర్గే అయోధ్యకు రాలేదు. ఇండియా కూటమికి నాయకత్వమేది? ఇప్పుడు ఎన్నికల్లో ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి ఉన్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కావాలా? 23 ఏళ్లు సీఎం, పీఎంగా ఉన్నా ఒక్క అవినీతి మరకలేని మోదీ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. దీపావళి నాడు కూడా సెలవు లేకుండా దేశ సైనికులతో కలసి పండుగ జరుపుకునే మోదీ ఓవైపు ఉంటే.. నోట్లో బంగారు స్పూన్తో పుట్టి, ఎండ పెరగగానే బ్యాంకాక్, థాయ్లాండ్కు చెక్కేసే రాహుల్ గాంధీ మరోవైపు ఉన్నారు.. ఎవరు కావాలి? ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాన మంత్రి ఎవరు? అంటే ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ఉంటారని అంటున్నారు. అలాంటి ఇండియా కూటమి భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారి ఏదైనా వస్తే కాపాడగలదా? ఆ మోదీకే ఉంది. యావత్ భారతానికి ఉచితంగా, వేగంగా వ్యాక్సినేషన్ చేయించారు. ఆ ముందు చూపుతోనే మనమంతా బతికిపోయాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేసింది తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. అన్నిరకాలుగా ఆదుకుంటోంది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ మోదీ ప్రభుత్వమే సంపూర్ణంగా నిధులిచి్చంది. పసుపు బోర్డు ఇచి్చంది. 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, రూ.20వేల కోట్లతో రీజనల్ రింగ్రోడ్డు, రూ.1,100 కోట్లతో ఎంఎంటీఎస్ మంజూరు చేశాం. పీఎంజీఎస్వై కింద రూ.6 వేల కోట్లు ఇచ్చాం. బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు, హసన్–చర్లపల్లి ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్, రూ.2 వేల కోట్లతో కృష్ణపట్నం–హైదరాబాద్ పెట్రోల్ పైప్లైన్, రూ.1,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫాక్టరీ పునఃప్రారంభం వంటి చేపట్టాం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు ప్రారంభించాం. అవినీతిమయ కాంగ్రెస్ను తరిమికొట్టేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లతో మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు అందరూ ముందుకురావాలి. తెలంగాణలో 12 సీట్లలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా మారుస్తాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. నిజామాబాద్లోనే పసుపు బోర్డు.. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం.. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తాం. ఎంపీ అరి్వంద్ వెంటపడి మరీ పసుపు బోర్డు ఏర్పాటును సాధించుకున్నారు. మరోసారి అరి్వంద్ను గెలిపిస్తే మరిన్ని ప్రయోజనాలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల కారణంగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మేం వాటిని రైతుల భాగస్వామ్యంతో సహకార పద్ధతిలో తెరిపిస్తాం. బీడీ కారి్మకుల కోసం నిజామాబాద్లో ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తాం.రిజర్వేషన్లపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం: కె.లక్ష్మణ్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా బీజేపీ దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవబోతోందని చెప్పారు.మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ఈటల రాజేందర్ దేశం సుభిక్షంగా ఉండాలంటే.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టి బూటకమన్నారు. -
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు.. మిగిలే ఉంది, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మనమే పూర్తి చేయాలి. నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. రూ.1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోతోంది. అల్యూమినియం, ప్లాస్టిక్ పరిశ్రమలు కరెంటు కోతలతో అల్లాడుతుంటే మనసుకు దుఃఖం కలుగు తోంది. గతంలో మోదీనే అసూయ పడేలా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తీసుకువచ్చాం. నాలుగైదు నెలల్లోనే ఇంత వ్యతిరేకతా? ఇది కొసవరకు ఉండే ప్రభుత్వం కాదు.. దుర్మార్గులు ఆగం చేసిర్రు. ఏ మాత్రం అధైర్య పడొద్దు. రాజకీయాల్లో తాత్కాలిక సెట్బ్యాక్ అనేది సాధారణమే. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా వచ్చేది మన ప్రభుత్వమే’’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఏమన్నారంటే..? వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ‘‘తొమ్మిదేళ్లు నడిచిన కరెంటు ఇప్పుడెందుకు పోతోంది. వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ఉన్నది ఉన్నట్లు ఇస్తే చాలు కదా? మంచినీళ్లు ఎట్ల మాయమైనయ్, మళ్లీ బిందెలేసుకుని మహిళలు రోడ్ల మీదకు ఎందుకు వస్తుర్రు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి ప్రసవాలు పెంచాం. బాలింతలకు కేసీఆర్ కిట్, ఆడశిశువుకు రూ.13వేలు, మగశిశువుకు రూ.12వేలిచ్చి ఇంటికి పంపాం. కానీ, నేడు అవేమీ ఇవ్వడం లేదు.ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ మన గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ సీఎం రేవంత్ మౌనంగా ఎందుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో సాగునీరు తాగునీరుకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి గతంలో రైతులకు అన్యాయం చేసే ఏ విషయం నా దృష్టికి వచి్చనా.. వెంటనే దాన్ని తిప్పికొట్టాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నిలిచిన వారిని గెలిపిస్తే తెలంగాణ కోసం పార్లమెంట్లో దుంకి అందుకొని కొట్లాడుతారు. బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన గతంలో ఎన్నోసార్లు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడారు. నా ప్రచారాన్ని ఆపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నాయి, అందుకే 48 గంటల ప్రచారాన్ని నిలిపివేసేలా చేశారు.. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.’’అని కేసీఆర్ అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం ‘‘బీఆర్ఎస్ హయాంలో రైతు వలసల నిరోధానికి, వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించాం. నీటి కొరత తీర్చేందుకు మిషన్ భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, దళితుల ఆత్మగౌరవం కోసం దళితబంధు చేపట్టాం’’అని వివరించిన కేసీఆర్, హుజూరాబాద్లో 99% ధనిక దళితులే ఉన్నారని చెప్పారు.సమైక్యాంధ్రప్రదేశ్లో 53 లక్షల టన్నుల వరి ఉత్పత్తయితే తెలంగాణలో మూడు కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. పంటను దళారీల పాలు చేయకుండా కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకున్నామని వ్యాఖ్యానించారు. రైతులకు ఫ్రీ కరెంట్ కోసం రూ.12,000 కోట్లు, రైతుబంధు కోసం రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.. వరి కొనుగోలుతో రూ.750 కోట్లు నష్టం అయినా పర్వాలేదని 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.ఇంకా రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు‘‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పథకాలు నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారు. డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కోతలు అయినప్పటికీ రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు’’అని విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement