- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు
- 2018 చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019 కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2018 చివర్లో.. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించా రు. మంత్రులు, పార్టీ నేతలతో మాట్లాడారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలని కోరుకుంటోందని, ఇందుకు భారీగా కసరత్తు చేస్తోందని, అదే జరిగితే రాష్ట్రంలో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు వస్తాయ న్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో దీనిపై చర్చ జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు పార్టీని త్వరగా సిద్ధం చేయాలని పిలుపుని చ్చారు. మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని, ప్రతినెలా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల మాదిరిగా భారీ సభలు నిర్వహిం చాలని సూచించారు. ఇకపై తాను కూడా పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని, ప్రతిరోజూ పార్టీ నేతలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.
మన ఓటు బ్యాంకు పెరిగింది
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఇటీవల తానొక సర్వే చేయించానని, దాని ప్రకారం టీడీపీ ఓటు బ్యాంకు పెరిగిందని చంద్రబా బు తెలిపారు. సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం టీడీపీ ఓటు బ్యాంకు 16.13 శాతం పెరిగిందని, అదే సమయంలో వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకు 13.45 శాతం తగ్గిందని, కాంగ్రెస్కు కేవలం ఒక్క శాతంగానే ఉందని వివరించారు. ఇటీవల మున్సిపాల్టీల్లో జరిగిన వార్డు ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీల ఓటు బ్యాంకును తేల్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజల సంతృప్తస్థాయి 52 శాతానికే పరిమితమైందని చంద్రబాబు చెప్పారు. తా ను పార్టీ కోసం కష్టపడి పని చేస్తుంటే, కొంద రు స్వలాభం కోసం పనిచేస్తున్నారని, వారివ ల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని అసహ నం వ్యక్తం చేశారు. గొడవలతో బజారున పడి పార్టీకి చెడ్డ పేరు తెచ్చారని పేర్కొన్నారు.
సోషల్ మీడియాను కట్టడి చేస్తాం..
సోషల్ మీడియాను కట్టడి చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ప్రస్తుతం అందుబా టులో ఉన్న భద్రతాపరమైన చర్యలతోపాటు మరికొన్ని విధివిధానాలను రూపొందించి సోషల్ మీడియాను నియంత్రిస్తామని చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడ రూరల్ మండలం గుంటుపల్లిలో పరిష్కార వేదిక కాల్సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసభ్య పదజాలం వాడుతూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వాలి
Published Sat, Apr 22 2017 12:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement