సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు తెలుగుదేశం పార్టీదే పూర్తి బాధ్యత అని, ప్రథమ ముద్దాయి చంద్రబాబేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చెన్నైలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుండా గాడిదలు కాస్తున్నావా చంద్రబాబూ అని మండిపడ్డారు.
రైలు తగలబడితేగానీ బాబుకు పరిస్థితి తీవ్రత అర్థం కాలేదా..?అని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష వహించడం సమర్థనీయమేనని, అయితే భార్యాబిడ్డలను సైతం దీక్షకు పురిగొల్పడం గృహహింస నిరోధక చట్టం కిందకు వస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలిట నటుడు పవన్ కల్యాణ్ ఒక శిఖండిలా దాపురించాడని మండిపడ్డారు. రాజకీయ ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా చంద్రబాబును బైటపడేసేందుకు పవన్ కల్యాణ్ పాటుపడుతున్నాడని ఆరోపించారు.
రెండేళ్లుగా గాడిదలు కాస్తున్నావా బాబూ?
Published Tue, Feb 9 2016 1:45 AM
# Tag
Related news
-
దీనికి జవాబు లేదా బాబూ?
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కు వచ్చిపడింది. ముస్లిం మైనారిటీలకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేత ఒకరు ప్రకటించడం ఇందుకు కారణం. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఈ ప్రకటనను ఖండించకపోవడం ముస్లిమ్ మైనారి టీలు గమనిస్తున్నారు. అందుకే ఇప్పటికే అరకొ రగా ఉన్న ముస్లిమ్ల మద్దతు తమ పార్టీ పూర్తిగా కోల్పోతుందని టీడీపీ భయపడుతోంది.ఇటీవల ఓ బహిరంగ సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లిమ్ మైనారిటీలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తప్పుపట్టారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిమ్ల రిజ ర్వేషన్లను రద్దు చేస్తామని తెగేసి చెప్పారు. లోక్ సభకు ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్లో బీజేపీకి నిరాశే ఎదురైనట్లు సంకేతాలుఅందుతున్నాయి. దీంతో కులాలకతీతంగా యావత్ హిందూ ఓటు బ్యాంకును కమలం పార్టీ వైపు మళ్లించడానికి బీజేపీ అగ్రనేతలు ముస్లిమ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారని భావిస్తున్నారు.ముస్లిమ్ల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి 2005లో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న సచార్ కమిటీ 2006లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లిమ్లు 14 శాతం ఉన్నారు. అయితే అధికార యంత్రాంగంలో ముస్లిమ్ల శాతం కేవలం 2.5 శాతం మాత్రమే. దళితులు, ఆదివాసీల కంటే దారుణ పరిస్థితుల్లో ముస్లి మ్లు ఉన్నారు. చదువు లేకపోవడమే ముస్లిమ్ సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ప్రధాన కారణమని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కుండబద్దలు కొట్టింది. ముస్లిమ్ సమాజం మేలు కోసం మొత్తం 76 సిఫార్సులు చేసింది ఈ కమిటీ. అయితే వీటిలో అమలుకు నోచుకున్నవి అతి తక్కువ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లిమ్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. విభజన తరువాత కూడా ఆంధ్రప్ర దేశ్లో ముస్లిమ్లకు నాలుగుశాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నా చంద్ర బాబు నోరు మెదపకపోవడం విడ్డూరం. నెత్తి మీద టోపీ పెట్టుకుని... ముస్లిమ్లతో ఆత్మీయ సమావేశాలంటూ సందడి చేసే చంద్రబాబు అసలు రంగు బయటపడింది. వాస్తవానికి రాయలసీమలో ముస్లిమ్ మైనా రిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కర్నూలు,నంద్యాల, కడప, రాయచోటి, కదిరి లాంటి అనేక ప్రాంతాల్లో గెలుపు ఓటములను ప్రభా వితం చేయగల స్థాయిలో ముస్లిమ్లు ఉన్నారు. రాయలసీమే కాదు కోస్తా జిల్లాల్లో కూడా వీరి జనాభా భారీగానే ఉంది. గుంటూరు తూర్పు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావు పేట, చిలకలూరిపేట, విజయవాడ పశ్చిమం, బందరు, పెడన వంటి అనేక ప్రాంతాల్లో కూడా ముస్లిమ్ మైనారిటీలు అభ్యర్థుల జయాపజయా లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు.అటువంటి ముస్లిమ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటే తెలుగుదేశం నిశ్శబ్దంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిమ్ల రిజర్వే షన్ రద్దు ఖాయం అని ముస్లిమ్లు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ముస్లి మ్లు పోలింగ్ నాటికి జగన్కి జై కొడతారని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.ఎస్. అబ్దుల్ ఖాలిక్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్మొబైల్: 63001 74320 -
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చెయ్యాలనేది ఆరెస్సెస్/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేక విధానం రిజర్వేషన్ ద్వారా కాక జనరల్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్ స్టీల్ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్ కమిటీని ఫేస్ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టారు ఎంప్లాయిమెంట్ను అమెరికా మోడల్లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్మెంట్ మొత్తాన్ని ప్రైవేట్ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. ఈ పని ఇప్పటికే ఎయిర్పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్మెంట్కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్ మస్క్లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.భారతదేశం అమెరికా కాదు, యూరప్ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్ను ఇంగ్లిష్ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్లను, కోచింగ్లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్ ఇదే చేస్తాయి. బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.భారతదేశపు ప్రైవేట్ రంగం అమెరికాలో, యూరప్లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి -
14 ఏళ్ల ముఖ్యమంత్రిపై పవర్ ఫుల్ పంచులు..
14 ఏళ్ల ముఖ్యమంత్రిపై పవర్ ఫుల్ పంచులు.. -
రైతన్నకు మన ప్రభుత్వం చేసిన మంచి.. చంద్రబాబు ఎందుకు చేయలేదు?
రైతన్నకు మన ప్రభుత్వం చేసిన మంచి.. చంద్రబాబు ఎందుకు చేయలేదు?
Related News by category
-
400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లోనూ విజయపథంలో తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గెలుపు కోసం బుధవారం రాత్రి పాతబస్తీలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని, అందులో హైదరాబాద్ సీటు తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. 40 ఏళ్లుగా రజా కార్లు హైదరాబాద్ను ఏలుతున్నారనీ, ఈ సారి బీజేపీకి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపుతో ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న అమిత్షా తాము అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయా లని పిలుపునిచ్చారు. అప్పుడే హైదరాబాద్ ప్రజలను ఎవ్వరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. అప్పటికే సమయం రాత్రి పదిగంటలవడంతో అమిత్షా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ముందుగా మాధవీలత మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ, ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో ఈసారి తప్పకుండా పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ప్రజలందరిలోని ఆవేశం ఓటు కింద మారాలని పిలుపునిచ్చారు. మహంకాళీ అమ్మవారికి అమిత్ షా పూజలు బుధవారం రాత్రి 9.24 గంటలకు అమిత్షా లాల్దర్వాజా మహంకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి ఐదు నిమిషాల పాటు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివాదం చేస్తూ..విజయ సంకేతం చూపుతూ.. పూజల అనంతరం అమిత్ షా 9.31 గంటలకు ప్రచార ర థం ఎక్కి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ..లాల్ దర్వాజా నుంచి వెంకట్రావ్ స్కూల్, లాల్ దర్వాజ్ మోడ్, సుధా టాకీస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోలో కమలనాధులు కదం తొక్కారు. వందేమాతరం...భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు అమిత్షాపై పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆయన ఒక చేత్తో విజయ సంకేతం, మరో చేత్తో కమలం పువ్వును చూపిస్తూ ముందుకు సాగారు. సుమారు 25 నిమిషాల పాటు ఓపెన్టాప్ జీప్పై నిలబడి రోడ్ షో నిర్వహించారు. యాకుత్పుర, చాంద్రా యణగుట్ట, చార్మినార్, బహదుర్పుర, మలక్పేట్, ఘోషామహల్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాజ్పేయి తర్వాత.. షానేపాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత దేశ హోంశాఖామంత్రి హోదాలో అమిత్షా ఇక్కడికి రావడం విశేషం. ఎంఐఎంకు కంచుకోటలా ఉన్న పాతబస్తీలో అమిత్షా రోడ్ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణులోŠల్ జోష్ నింపింది. కాగా, అమిత్షాకు పలువురు ముస్లింలు మర్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఇక నిన్న మొన్నటి వరకు ఎడమొఖం.. పెడముఖంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రచారం నిర్వహించడం గమనార్హం. -
ఇవ్వడమే జగన్కు తెలుసు: సీఎం జగన్
జగన్ను చంపేస్తే తప్పేమిటంటున్నాడు..మీ బిడ్డ జగన్ను ఓడించలేమని, ఆ పేద అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వారి కుటుంబ సభ్యులు మోసపోవడానికి సిద్ధంగా లేరని, ఎంత ప్రలోభపెట్టినా తన మాటలు నమ్మట్లేదని గ్రహించిన చంద్రబాబు నోట జగన్ను చంపేస్తే ఏమవుతుంది? అన్నమాట వినిపిస్తోంది. నాడు వైఎస్సార్ గాల్లో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. నేడు జగన్ను చంపేస్తే తప్పేమిటని అంటున్నాడు. రాజకీయాల్లో ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?– బొబ్బిలి సభలో సీఎం జగన్తట్టుకోలేకపోతున్నారు..పేదల గురించి జగన్ మాట్లాడుతుంటే పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు, ఆం«ధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, వదినమ్మకు చాలా బాధగా, విపరీతమైన కోపంగా ఉంటుంది. జగన్ ఎప్పుడూ పేదలు.. పేదలు అంటుంటే విని తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుంది. పేదలు ఒక ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారు. కులం పరంగా, ఫలానా పార్టీ పట్ల అభిమానం వల్ల కావొచ్చు.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటికి వెళ్లాక మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చర్చించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.– ఏలూరు సభలో సీఎం జగన్దీవించండి..బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానీని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘జగన్ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు చంద్రబాబూ! జగన్ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే చంద్రబాబుకు తెలియదు. వందేళ్ల క్రితం బ్రిటీష్ హయాంలో జరిగిన సర్వే తర్వాత ఇప్పుడు చేపట్టిన సర్వేతో పక్కాగా రికార్డులు సృష్టించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడమే దీని ఉద్దేశం. 15 వేల గ్రామ సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించి ఇలా సర్వే చేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. రైతన్నలు కోర్టులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి ప్రతి ఒక్కరికీ వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే లక్ష్యంతో రీ సర్వే ద్వారా సరిహద్దు రాళ్లను నాటించి రికార్డులు అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి రైతన్నలకు ఇస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలేగానీ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. మనం అమలు చేసిన పథకాల గురించి చెబుతుంటే చంద్రబాబుకు కోపం వస్తోంది. గత 59 నెలల కాలంలో ఎన్నడూ లేని విప్లవాత్మక సంస్కరణలను మీ బిడ్డ తెచ్చినందుకే ఆయనకు కోపం వస్తోంది. ఈ ఎన్నికల్లో బాబును ఓడించడమంటే పేదలను గెలిపించడమే’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నేరప్రవృత్తికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని, వెన్నుపోట్లు, హత్యలతోనే ఆయన రాజకీయాలు ముడిపడి ఉంటాయని ధ్వజమెత్తారు. సొంతమామ ఎన్టీఆర్ను, వంగవీటి రంగాను, పింగళి దశరథరామ్ను, ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతోనే కడ తేర్చారన్నారు. బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ మాట్లాడారు. ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివిమరో 13 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఇది జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. ఓటుతో మీ తలరాతలు మారతాయి. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే, మళ్లీ మోసపోవడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బాబుకు ఓటు వేయడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. పేదలంటే బాబు ముఠాకు కోపం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. మీ బిడ్డ ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మీరంతా చూస్తున్నారు కదా ఆ కోపాన్ని.. ఆయనకు మనమీద ఎందుకంత పిచ్చికోపం వస్తోందంటే.. గతంలో ఎన్నడూ చూడని విధంగా మీ బిడ్డ విప్లవాలు తెచ్చాడు కాబట్టే. నేను చెబుతున్న విషయాలు గతంలో ఎప్పుడైనా అమలు జరిగాయో లేదో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. జగన్ను చంపితే ఏమవుతుందంటున్న బాబుమీ జగన్ ప్రజలకు ఏం చేశాడో గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు మాత్రం ఏం మాట్లాడుతున్నాడో మీరంతా గమనిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఇదే పెద్దమనిషి రేపు జగన్ను చంపితే ఏం జరుగుతుంది? అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన మానసిక పరిస్థితి, ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించాలని కోరుతున్నా. ఏమయ్యా చంద్రబాబూ..! ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి? అని నేను అడుగుతుంటే నీ సమాధానం అదా?అక్కచెల్లెమ్మలే రక్షించుకుంటారు.. అయ్యా చంద్రబాబూ.. నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ 59 నెలల్లో మంచి జరిగిన ఆ కోట్ల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాలు జగన్కు తోడుగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ జగన్కు తోడుగా, అండగా ఉన్నారయ్యా చంద్రబాబూ! వారి జగన్ను వారే రక్షించుకుంటారు. నాకు నీ మాదిరిగా జడ్ ప్లస్, జడ్ డబుల్ ప్లస్ సెక్యూరిటీ అక్కర్లేదయ్యా. అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ లంచాలు, వివక్ష లేకుండా ఇచ్చిన రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ బటన్లే నాకు శ్రీరామరక్ష. పిల్లలు బాగుండాలని ఇచ్చిన అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఆరాటపడుతూ అందించిన చేయూత, ఆసరా, సున్నావడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. ఇవన్నీ నాకు రక్ష అని చంద్రబాబుకు చెబుతున్నా. నా అవ్వాతాతలకు మంచి చేస్తూ ఇంటివద్దే అందించిన పెన్షన్లతో దేవుడికి చేస్తున్న ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల ప్రార్థనలే వారి బిడ్డ జగన్కు శ్రీరామరక్ష. మంచిని అందుకున్న నా రైతన్నలు ఆ భూమాత, పంచ భూతాల సాక్షిగా చేస్తున్న ప్రార్థనే నాకు శ్రీరామ రక్ష. జగన్ మార్కు సామాజిక న్యాయంఅసెంబ్లీ, ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 100 స్థానాల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు టికెట్లు ఇచ్చాం. మంత్రి పదవుల్లో ఏకంగా 68 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే నాలుగు పదవులు ఆ వర్గాలకే కేటాయించి గౌరవించాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు వారికే కల్పిస్తూ చట్టం తెచ్చాం. ఇంత సామాజిక న్యాయం, తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా రెండు బటన్లు ఫ్యాను గుర్తు మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి. బాబు వ్యాఖ్యలు నేరప్రవృత్తికి నిదర్శనంఆ రోజు నా తండ్రి రాజశేఖరరెడ్డి చేస్తున్న మంచి పనులు, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా నాన్ననుద్దేశించి ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్...!’ అన్న నీ వ్యాఖ్యలను నేను ఎప్పటికీ మర్చిపోలేను చంద్రబాబూ. నాడు నా తండ్రిని, నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ దిగజారుడుతనానికి, నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.పేదలకు పథకాలు అందాలా.. లేదా?చంద్రబాబును అడుగుతున్నా.. ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్ రాష్ట్రంలో 90 శాతం మంది పేదలకు ఈ రోజు మంచి చేయడం కొనసాగాలా.. వద్దా? ఎవరు మేలు చేశారు? నిజమైన నాయకుడు ఎవరో ఆలోచన చేయాలని అందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలు 1.44 కోట్లు. అంటే జనాభాలో 90 శాతం. వీరందరూ పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా? లేదా? ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులున్న వారు జనాభాలో 95 శాతం ఉన్నారు. వీరికి పథకాలు అందాలా లేదా? ఉన్నత చదువులు చదువుతున్న 93 శాతం మందికి పూర్తి ఫీజుల చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు వసతి దీవెన అందాలా.. లేదా? పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు 1.05 కోట్ల మంది పేదలు కాదా? వీరందరికీ పథకాలు అందాలా.. లేదా? రాష్ట్రంలో అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి అక్కలు 66 లక్షల మందికిపైగా పెన్షన్లు తీసుకుంటున్నారు. రైతు భరోసాతో 55 లక్షల మంది రైతన్నలకు అండగా నిలిచాం. మరో 60 లక్షల మంది అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన తీసుకుంటున్నారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. ఇప్పుడు చెప్పండి.. వీరంతా పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా లేదా?ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది. జగన్ మీ భూములు కాజేస్తాడంటూ ప్రతి ఒక్కరికీ మెసేజ్లు పంపుతూ, ఫోన్లు చేసి చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు– పాయకరావుపేట సభలో సీఎం జగన్మీ బిడ్డ తెచ్చిన కొన్ని విప్లవాలివీ..⇒ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్ కానుక విప్లవమా? కాదా?⇒ గవర్నమెంట్ బడుల్లో నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం, బడి తెరిచే సమయానికే విద్యాకానుక, బైజూస్ కంటెంట్, 3 తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్పీలు లాంటివి విప్లవమా? కాదా?⇒ తొలిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ టెక్ట్స్బుక్స్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన కరిక్యులమ్లో భాగం చేయడం లాంటివి విప్లవాలు కాదా?⇒ మీ పిల్లలను బడికి పంపించండమ్మా.. మీకు తోడుగా మీబిడ్డ ఉన్నాడంటూ అమ్మఒడి అందించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ⇒ అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీతోపాటు 31లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలోనే మహిళా పోలీస్, భద్రత కోసం దిశ యాప్, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మీ జగన్ కాదా? ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? ⇒ మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఆర్బీకేలు, ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా, పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు, జీఎల్టీ, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్, ఆయిల్పామ్ రైతులకు మెరుగైన ధర ఇచ్చిందెవరు? ఇవన్నీ విప్లవాలు కాదా?⇒ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షలదాకా ఉచిత వైద్యం, ఆపరేషన్ తరువాత విశ్రాంతి సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటివి అమలు చేసింది మీ బిడ్డ పాలనలో కాదా? ఇవన్నీ వైద్య రంగంలో విప్లవాలు కాదా? ⇒ మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం, వాహనమిత్ర, చేదోడు, తోడు, ఎంఎస్ఎంఈలకు సంపూర్ణ మద్దతు, లా నేస్తం లాంటివి తెచ్చిందెవరు?⇒ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఊరిలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటివద్దే అందుతున్నాయి. వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 60–70 ఇళ్లకు పెన్షన్ నుంచి పౌరసేవలు, పథకాలు, రేషన్ దాకా డోర్ డెలివరీ అవుతున్నాయి. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్ క్లినిక్, నాడు–నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడులు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గతంలో ఉన్నాయా? ⇒ మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు, తిరుగుళ్లు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయంటే ఎవరైనా నమ్మేవారా? నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, పిల్లలు బాగుండాలని 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా అందించడం ఓ విప్లవాత్మక చరిత్ర కాదా?అబద్ధాలకు రెక్కలు...చంద్రబాబు తన అబద్ధాలు, మోసాలకు రెక్కలు కడుతున్నాడు. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకుని మనపై నెపం వేస్తున్నాడు. ఏ రోజైనా ఆయన అవ్వాతాతల బాధలు, కష్టాలను పట్టించుకున్నాడా? ఏనాడైనా ఇంటికే పెన్షన్ ఇచ్చాడా? తన మనిషి నిమ్మగడ్డ రమేశ్తో కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖలు రాయించి ఇంటివద్దే అందిస్తున్న పెన్షన్లను అడ్డుకున్నాడు. ఆ అవ్వాతాతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో మీబిడ్డపై నెపం మోపుతున్నాడు.ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా?⇒ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క మంచి పనిగానీ, పథకంగానీ గుర్తుకొస్తుందా? ఆ పెద్దమనిషి తన జీవిత కాలంలో ఏ రోజూ పేదలకు మంచి చేసిందిలేదు. 2014లోనూ ఇదే మాదిరిగా హామీలిచ్చి వంచించాడు. ఒక్కసారి వాటిని గుర్తుచేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా చంద్రబాబును నమ్ముతారేమో మీరే చెప్పండి.⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానంటూ ఏకంగా రూ.14,205కోట్లు ఎగనామం పెట్టాడు. ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా ఎవరికైనా ఒక్క రూపాయి అయినా బ్యాంకులో జమ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏ ఒక్క ఇంటికైనా 60 నెలల్లో రూ.2వేలు చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్నాడు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? మన బొబ్బిలి, పాయకరావుపేటలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ⇒ ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. ⇒ ఇప్పుడు మళ్లీ మోసగించేందుకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు. -
రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే
కరీంనగర్ టౌన్: తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలడంతో రేవంత్రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు పోతుందనే భయంతో రేవంత్రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నా రని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను బీజేపీ ప్రభుత్వం నియమించిందన్నారు. ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్రెడ్డికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని తెలీదా? మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని కమాన్చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్షోకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్రమంత్రి మురుగన్తోపాటు సంజయ్ పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఆయన ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్రమంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని, రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. పొన్నం, వినోద్కుమార్ కరీంనగర్కు ఏంచేశారో చెప్పాలన్నారు. ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందాలంటే, దేశ రక్షణ కావాలంటే మోదీనే మళ్లీ ప్రధాని కావాలని సంజయ్ తెలిపారు. దేశమంతా కరీంనగర్లో బండి సంజయ్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. తనను ఎంపీగా గెలిపించి మోదీని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు. -
బీజేపీ, బీఆర్ఎస్ను డకౌట్ చేస్తాం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/శేరిలింగంపల్లి/ మూసాపేట: మే 13న తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్లను డకౌట్ చేస్తామని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి తారానగర్లోని తుల్జాభవానీ మాత ఆల యం ముందున్న ప్రధానరోడ్డులో బుధ వారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 3న సెమీ ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ను తొడగొట్టి చిత్తు చేసి ఓడించాం..మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేయడం ఖాయమని చెప్పా రు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోదీ ఇచ్చింది ఏమీ లేదని.. ఏపీకి పాచి పోయిన రెండు లడ్లు, కర్ణాటకకు చెంబు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమ ర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఐటీఐఆర్ ప్రకటించిందని, ఐఐఎం, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. సునీతారెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా∙మహేందర్రెడ్డికి వేసే ప్రతి ఓటు తనకు వేసి నట్టే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కూక ట్పల్లి నియోజకవర్గపరిధిలోని మూసాపేట లో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఎంపీగా సునీతమ్మను గెలిపిస్తే తనను గెలిపించినట్టే అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొర పాలనను తుంగలో తొక్కి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని చెప్పారు. అర్ధరాత్రి పోలీసులతో తలుపులు కొట్టించి అరెస్టు చేయించి కొడంగల్లో ఓడించాడని, సోనియమ్మ ఆశీస్సులతో మల్కాజ్గిరి ఎంపీగా నిలబడితే ఇక్కడి ప్రజలే ప్రశ్నించే గొంతుక ఉండాలని తనను గెలిపించారని చెప్పారు. దేశాన్ని కార్పొరేట్లకు అమ్మే కుట్ర..రాజ్యాంగాన్ని మార్చి, దళితులు, బీసీల రిజర్వేషన్లు తొలగించి మొత్తం దేశాన్నే అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం మధ్యా హ్నం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిజామా బాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి మద్దతుగా ‘కోరుట్ల జనజాతర’ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్న ఈ సభలో రేవంత్ ఏమన్నారంటే.. ‘ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్, ఆటో రిక్షా కార్మికులు, సకల జనుల సమ్మెలో పోరాడితేనే తెలంగాణ కల సాకారమైంది. ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీ కావు. 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఈడీ, సీబీఐ తరహాలో ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టిస్తే నేను, కాంగ్రెస్ కార్యకర్తలు భయపడం. ఇలాగే పదేళ్లు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన కేసీఆర్ను మొన్న ఎన్నికల్లో ప్రజలు నడుం విరగ్గొట్టి మూలకు కూర్చోబెట్టారు. కొమురంభీం, చాకలి ఐలమ్మలు పుట్టిన గడ్డ అని మర్చిపోవద్దు. ఇక్కడ ప్రజలను అణచాలని చూసిన నిజాం, రజాకార్లకు ఏం గతిపట్టిందో తెలుసుకుంటే బీజేపీకే మంచిది’ అని వ్యాఖ్యానించారు.75 ఏళ్లు అవుతున్నా మార్పురాలేదు ‘అంబేడ్కర్లాంటి మహనీయుల చొరవతో సమాజంలో వెనకబడ్డ దళితులు, బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దళిత, గిరిజన, బలహీన వర్గాల జీవితాల్లో పూర్తిస్థాయిలో మార్పు రాలేదు. 150 రోజులు 4000 కి.మీ భారత్ జోడో పేరిట పాదయాత్ర చేసిన సమయంలో బలహీనవర్గాలకు చెందిన డాక్టర్లు, ఇంజినీర్లు ఇతర మేధావులు రాహుల్గాంధీని కలిసి ఈ దేశంలో 52శాతం ఉన్న తమకు జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీ గణనకు కేబినెట్ తీర్మానం చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్దే.మామిడి పరిశోధన కేంద్రం మంజూరు చేస్తాజీవన్రెడ్డి.. 43 ఏళ్లుగా ఆరుసార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీగా నిర్వ హించిన ప్రతీ పదవికీ వన్నె తెచ్చారు. జగిత్యాలకు జీవన్రెడ్డి అడిగిన మామి డి పరిశోధన కేంద్రాన్ని నేను మంజూ రు చేస్తా, కానీ, కోరుట్ల, జగిత్యాలలో ఆయనకు లక్ష మెజారిటీ ఇవ్వాలి’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. -
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత మని, దాన్ని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే తాను ప్రస్తావించానని.. ఆధా రాలతో సహా తాను చెప్తున్న అంశాలపై కేంద్రం వివరణ ఇవ్వడంగానీ, సవరించుకోవడం గానీ చేయాలని స్పష్టం చేశా రు. రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సమయం, సందర్భం, అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతోనే బీజేపీ పనిచేస్తోంది. ఆ విషయాన్నే నేను ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగు తోంది. తమ ఎన్నికల ప్రయోజనాలకు దెబ్బతగులుతుందనే భయంతో కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసి నాపై అక్రమ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి కూడా నోటీసులు ఇచ్చారు. మోదీ, అమిత్ షా, బీజేపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేసు నమోదు చేశారు. 2000వ సంవత్సరంలో బీజేపీ ప్రధాని వాజ్పేయి, 2002లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చేసిన సూచనలను బీజేపీ ప్రస్తుతం రహస్య ఎజెండాగా మార్చుకుంది. వాటి ఆధారంగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే అమలు చేసేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే నేను ప్రస్తావించా. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను చేస్తున్న ఆరోపణలపై తగిన సమాధానం ఇవ్వాల్సింది పోయి.. విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించిన తరహాలో నాపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు.లొంగిపోతానని అనుకుంటున్నారా?ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడే నేను లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు ఎలా అనుకుంటున్నారు? బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి గతంలో పార్లమెంటులో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రసంగంలో చెప్పించడంతోపాటు, కమిషన్ నియమిస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో నివేదిక కూడా ఇచ్చింది. 2004లో యూపీఏ–1 అధికారంలోకి రావడంతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం నిలిచిపోయింది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న గోల్వాల్కర్, సిద్ధాంతకర్త ఎన్జీ వైద్య, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే తదితరులు రిజర్వేషన్ల రద్దుపై పలు సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు. దళితులకు హక్కులు, కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరం లేదని.. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఉద్దేశంగా ఉంది. బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ సిఫారసు అమలుకు వీపీ సింగ్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. అద్వానీ నేతృత్వంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. ఆ రిజర్వేషన్లు న్యాయ సమ్మతమేనని, అయితే 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ 50శాతం పరిమితిని తొలగించాలంటే.. బీసీ జనాభాను లెక్కించాలన్న కోర్టు సూచన మేరకే భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ జన గణన కోసం మా ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది.రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికలుకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చోట కులగణన చేస్తామనే విధానం తీసుకోవడంతో బీజేపీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పెంచుతుందనే ఉద్దేశంతో లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు పార్టీలను చీల్చి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. 17వ లోక్సభలో ఆర్టికల్ 370రద్దు, సీఏఏ అమలు వంటి ఆర్ఎస్ఎస్ ఎజెండాను పూర్తి చేసింది. 18వ లోక్సభలో హిందూ దేశంగా భారత్, రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ విషయాలను ప్రస్తావించినందునే కేంద్ర ప్రభుత్వం నాపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. అమిత్ షా నియంత్రణలో పనిచేసే ఢిల్లీ పోలీసులను ప్రయోగించి, నాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోంది.ఎటువైపు నిలవాలో తేల్చుకోండిబీజేపీకి వేసే ప్రతీ ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. ప్రస్తుత ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి చుట్టూ జరగడం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలా, వద్దా అనే అంశం చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువైపు నిలబడాలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు తేల్చుకోవాలి. పోలీసులతో బెదిరించాలని మోదీ, అమిత్ షా చూస్తే అది కుదరని పని. గతంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే బీజేపీ ఆలోచనల అమలుకు రాజ్యాంగ పరిమితులు అడ్డుపడ్డాయి. అందుకే ఇప్పుడు 400 సీట్ల కోసం అరాచకాలు, అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవం చేసుకుంటున్నారు..’’ అని రేవంత్ ఆరోపించారు.అభివృద్ధి కోరితే.. ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది– కేంద్ర ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్రెడ్డి వ్యంగ్యాస్త్రాలుకేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చింది. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరి నదుల్లో వాటాల పంపకం, మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయహోదా వంటివి అడిగితే గాడిద గుడ్డు ఇచ్చింది. మొత్తంగా ‘తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రధాన అడ్డు.. పదేండ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు’’ అని పోస్ట్ చేశారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement