చెన్నై: గల్లంతైన కోస్టుగార్డు విమానానికి చెందిన బ్లాక్బాక్స్ను ఆదివారం చెన్నైకు చేర్చారు. దీనిని పరిశీలించిన అధికారులు బెంగళూరు లేదా, కాన్పూర్కు తరలించేందుకు సిద్ధం అయ్యారు. గస్తీలో ఉన్న భారత కోస్టుగార్డుకు చెందిన సీజీ-791 విమానం గత నెల ఎనిమిదో తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. దీని కోసం శతవిధాలుగా గాలింపు జరిపినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో ఆ విమానం బ్లాక్బాక్సు తమకు లభించినట్టుగా శనివారం కోస్టుగార్డు వర్గాలు ప్రకటించాయి. దీంతో ఇక ఆ విమానంలో ఉన్న అధికారులు ప్రాణాలతో ఉండేది అనుమానంగా మారింది. ఆ విమానం సముద్రంలో కుప్ప కూలినట్టు నిర్ధారణ అయింది. ఇందుకు కారణం చిదంబరం సమీపంలో 950 అడుగుల లోతులో ఈ బ్లాక్బాక్సు కూరుకు పోయి ఉండడమే.
ఎట్టకేలకు ఆ బాక్సును అతి కష్టం మీద సముద్రం నుంచి బయటకు తీశారు. తమకు లభించిన ఆ బాక్సును ఆదివారం చెన్నైలోని కోస్టుగార్డు కార్యాలయానికి తరలించారు. అక్కడ అధికారులు ఆ బాక్సును పరిశీలించారు. ఈ బాక్సులో చివరి సమయంలో నమోదైన రికార్డు వివరాలు, పెలైట్ చివరి సంభాషణ తదితర వివరాలు నమోదై ఉండేందుకు అవకాశాలు ఎక్కువే. దీంతో ఏమి జరిగిందోనన్న వివరాలను ఆ బ్లాక్స్ మాత్రమే స్పష్టం చేయనున్నది. దీంతో ఆ బాక్సులోని వివరాలను తెలుసుకునేందుకు బెంగళూరు లేదా, కాన్పూరులోని వైమానిక పరిశోధన కేంద్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ పరిశోధన కేంద్రాల్లో జరిపే పరిశీలన మేరకు విమానం ప్రమాదం కారణంగా కుప్ప కూలిందా..? మరేదేని కారణాలు ఉన్నాయా..? అన్నది స్పష్టం కానున్నది.
చెన్నైకు బ్లాక్బాక్స్
Published Mon, Jul 13 2015 8:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement