కార్యకర్తలకు వెన్నంటి ఉంటున్నారనే.. | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు వెన్నంటి ఉంటున్నారనే..

Published Sat, Apr 13 2019 11:14 AM

YSRCP Leaders Visit MLA Pushpa Srivani House - Sakshi

జియ్యమ్మవలస: ఓటమి భయంతోనే టీడీపీ నా యకులు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) తెలిపారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజును ఆయన శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. టీడీపీ నాయకులు చేస్తున్న దాడులను ఖండించారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా కార్యకర్తల వెన్నంటి ఉండి పోరాడుతున్న పుష్పశ్రీవాణిని అంతం చేయాలనే ఆలోచనతో కుట్ర లుపన్ని దాడులకు పాల్పడ్డారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు, సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణతో పాటు రాష్ట్ర నాయకుల ఆశీస్సులు పుష్పశ్రీవాణికి మెండుగా ఉండడం చూడలేకే అంతం చేసేందుకు కుట్రపన్నారని విమర్శించారు. పరామర్శించిన వారిలో పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి కె.భాగ్యలక్ష్మి, నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, బలి జిపేట మండల కన్వీనర్‌ పాలవలస మురళీకృష్ణ, కె.వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement