తాజా రాజకీయ పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | Sakshi
Sakshi News home page

తాజా రాజకీయ పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Published Sat, Feb 10 2018 1:17 PM

Ys Jaganmohanreddy fires on Chandrababu over SCS  - Sakshi

సాక్షి, నెల్లూరు : ఏ నైతిక విలువలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. తాజా రాజకీయ పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ శనివారం ట్వీట్‌ చేశారు. 'విభజన చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్‌ వేదికగా అప్పటి పాలక, విపక్షాలు కలిసి మాటిచ్చాయి. మార్చి 2014లో ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ప్రత్యేక హోదా అమలు అంశాన్ని ప్రణాళికా సంఘానికి కూడా పంపారు. ఏ నైతిక విలువలతో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు.  ఏమిస్తారో తెలియని ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడతారా. మీ కంటి తుడుపు చర్యలు ఆపండి. ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పండి' అని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement