70వ రోజు ప్రారంభమైన పాదయాత్ర | Sakshi
Sakshi News home page

70వ రోజు ప్రారంభమైన పాదయాత్ర

Published Wed, Jan 24 2018 9:44 AM

ys jagan started 70th day padayatra - Sakshi

సాక్షి, నెల్లూరు : ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 70వ రోజుకు చేరుకుంది.  బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా ఉమ్మాలపేట శివారు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా క్యాంపు కార్యాలయం ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది.

వేలాది మంది ప్రజలు వైఎస్‌ జగన్‌తో కలిసి నడిచారు. దారిపొడువునా ప్రజలు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి వైఎస్‌ జగన్‌ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజుపాలెం చేరుకున్నారు. ఈసందర్భంగా జననేతకు స్థానిక నేతలు, కర్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి శిరసనంబేడు చేరుకుంటారు. అనంతరం చావలి చెక్‌పోస్టు, తాడ్వాయ్‌పాడు మీదగా నాయుడుపేట వరకూ ప్రజసంకల్పయాత్ర కొనసాగనుంది.

Advertisement
Advertisement