పాలకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రైతుల కష్టాలు పట్టవని, వారి కన్నీరు గుర్తించడంలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సోమవారం ఆయన పోరాట యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి అందరి సహకారం పొంది ఇప్పుడు ఒంటరిగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటూ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రప్రదేశ్కు చంద్రబాబు మేలు చేస్తారని గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని.. అయితే నాలుగేళ్లుగా ఆయన తీరు మారలేదన్నారు. అధికారాన్ని కేవలం భూ కబ్జాలు, ఇసుక మాఫియా కోసం వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో టీడీపీ అరాచకాలను గుర్తించామన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ భూకబ్జాలు, ఇసుక మాఫియాతో నిండిపోయిందన్నారు. మంత్రి కళా వెంకటరావు, విప్ కూన రవికుమార్ల నియోజకవర్గాల్లో ఇసుకను దర్జాగా దోపిడీ చేస్తున్నారన్నారు. వేల కోట్లు దండుకుంటున్న నాయకులు రైతులకు కనీసం సాగునీరు కూడా అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఇక్కడి డబ్బులు హైదరాబాద్లో పెట్టి ఈ ప్రాంతాలకు అన్యాయం చేశారని, ఇప్పుడు కూడా అమరావతి పేరుతో ప్రజల డబ్బును ఒకే చోట కుమ్మరిస్తున్నారని విమర్శించారు.
వెనుకబడిన జిల్లాలకు కనీసం నిధులు అందించడంలేదన్నారు. తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. టీడీపీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును చెడగొడుతూ ఆ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. ప్రత్యేక హోదాతోనే యువతకు ఉపాధి దొరుకుతుందని.. అందుకోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబుకు రైతుల కన్నీరు పట్టదు
Published Tue, May 29 2018 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement