ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘నవరత్నాల గురించి మా అన్న చెప్పాడని అందరికీ చెప్పండి.. ఓ అవ్వా.. నా మనవడు చెప్పాడని అందరికీ చెప్పు... అమ్మా.. నా కొడుకు చెప్పాడని చెప్పండి.. దేవుడి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా నవరత్నాలను అమలు చేస్తామని చెప్పండి. పేదలందరినీ ఆదుకుంటామని కూడా చెప్పండి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 94వ రోజు బుధవారం ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని చెరువుకొమ్ము పాలెం వద్ద తనను కలిసిన మహిళలతో ఆయన మాట్లాడారు.
అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనల్నందరినీ మోసం చేశారని, ఇలాంటి నాయకుడిని ఇకపై నమ్మొద్దని చెప్పారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేస్తామో మీరంతా తెలుసుకుని ఇళ్లకు వెళ్లి అందరకూ చెప్పాలని కోరారు. ‘మన చిట్టి పిల్లలను బడులకు పంపిస్తే.. ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తాం. పెద్ద పెద్ద చదువులకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది. పైగా వారి హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం. అవ్వాతాతల పింఛన్ వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇచ్చి ఆదుకుంటాం. అర్హత వయసు తగ్గించడం వల్ల ఇంకా ఎక్కువ మందికి మేలు జరుగుతుంది.
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి.. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా చంద్రబాబు దారుణంగా మోసం చేశారు కదా.. (అవును.. అవును.. అని మహిళల స్పందన) మనందరి ప్రభుత్వం రాగానే ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణం ఎంత ఉందో ఆ మొత్తాన్ని నాలుగు విడతలుగా వారి చేతికే నేరుగా అందిస్తాం. మీకు సున్నా వడ్డీకే రుణాలు కావాలా? వద్దా? (కావాలి.. కావాలి అంటూ మహిళల స్పందన) వాస్తవానికి గత ప్రభుత్వాల్లో సున్నా వడ్డీకే మహిళలు, రైతులకు రుణాలు లభించేవి. ఎలా వచ్చేవంటే వారు తీసుకునే రుణాలపై వడ్డీని ఆ ప్రభుత్వాలే బ్యాంకులకు చెల్లించేవి కనుక. కానీ చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ మొత్తాన్ని కట్టడం మానేసింది. అందుకే బ్యాంకులు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అప్పుడు బ్యాంకులు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది’ అని జగన్ చెప్పారు. ఈ విషయాలన్నింటినీ అందరికీ వివరించాలని కోరారు.
నవరత్నాలతో పేదలకు భరోసా
Published Thu, Feb 22 2018 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement