రెండు తెలుగు రాష్ట్రాలలో సరాసరి వారానికి ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతున్నారని అధికారిక గణాం కాలు చెబుతున్నాయి. వీరిలో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గరి నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల వరకు ఉంటున్నారు. తప్పిపోయిన వాళ్లలో 33 శాతం పిల్లలు తిరిగి తమ వారి వద్దకి చేరుకుంటుండగా 21 శాతం పిల్లలు శవాలుగా లభ్యమౌతున్నారు.
పిల్లలు ఇంత భారీ సంఖ్యలో కనిపించకుండా పోతున్న కారణాలు చూస్తే, ప్రభుత్వ దవాఖానాల్లో పసిగుడ్డులను పనిగట్టుకొని తల్లి పొత్తిళ్లనుంచి ఎత్తుకపోయి ఆ పిల్లలను అంగడి సరుకుల్లా పట్టణాల్లో అమ్మివేస్తున్నారు. ఇక పెద్దలపై ఉన్న పగా, ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎత్తుకెళ్లడం, సంపన్నుల పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది.
6 నుంచి 12 ఏళ్ల పిల్లలను సంతల్లో, జాతరల్లో, రద్దీ ప్రదేశాల నుంచో తల్లి ఆదమరచి ఉన్న సమయంలో ఎత్తుకెళ్లి, యాచకుల మాఫియా వారిని యాచకులుగా చేసి బిచ్చం ఎత్తించడం చూస్తున్నాం. ఇక పెద్ద పిల్లలైతే ఇళ్లలో వేధింపులు, సవతి తల్లి లేదా సవతి తండ్రి అఘాయిత్యాలను తాళలేక పారి పోయి యాచకులుగానో, బాల కార్మికులుగానో జీవిం చడం లేదా సంఘ వ్యతిరేక ముఠాల బారిన పడి మత్తు పదార్థాల అక్రమ రవాణాలోనో, వ్యభిచార గృహాల్లో, దొంగలుగానో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వారు కళ్లముందే కనిపిస్తున్నా వారి గురించి ఆరా తీయకపోవడం పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చు.
పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒక బంగారు గొలుసు లేదా పర్సు పోయిందని ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారునికి ఇచ్చిన ప్రాధాన్యత పిల్లలు కన్పించకుండా పోయారన్న విషయంలో ఇవ్వడం లేదు. దేశ భావి పౌరులైన పిల్లలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కనీస చర్యలు కూడా చేపట్టకపోవటం గర్హనీయం.
పిల్లలు తప్పిపోయి అనంతరం ప్రాణాలు కోల్పోవడమో, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడటమో, అమ్మకానికి గురికావడమో, మాఫియాల చేతుల్లో దుర్భర జీవితాన్ని కొనసాగించడం కట్టడి చేయాలంటే ఎలాంటి పంచవర్ష ప్రణాళికలు అక్కర లేదు. కేవలం పిల్లల్ని, పిల్లలుగా చూస్తే చాలు. రోడ్లపై ఉన్న పిల్లలని చూసి కనుగొని ముందుగా ఆశ్రమాలకు చేర్చి అనంతరం అమ్మానాన్నలకు అప్పగించవచ్చు. అలాగే పిల్లలు తప్పిపోయినారనే ఫిర్యాదు వచ్చిన వెంటనే అత్యంత ప్రాధాన్యతాంశంగా ఓ ప్రాణం కాపాడాలన్న సంకల్పంతో, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పోలీసులు పరిశోధన, దర్యాప్తు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
బాలకార్మిక అక్రమ తరలింపును అరికట్టడానికి కార్మిక శాఖ నిరంతరం నిజాయితీగా పనిచేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగానికి పిల్ల లను రక్షించాలనే సంకల్పం ఉండాలి. వారికి ఈ బాధ్యత ఉండాలంటే ప్రభుత్వాలు కేవలం ఓటర్ల వైపే కాకుండా పిల్లలపై సైతం దృష్టి పెట్టాలి.
(నేడు వరల్డ్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే)
అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు,
బాలల హక్కుల సంఘం ‘ 93910 24242
కనుమరుగవుతున్న బాల్యం
Published Thu, May 25 2017 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement