రైల్వేశాఖను ప్రైవేటీకరించేది లేదు | Sakshi
Sakshi News home page

రైల్వేశాఖను ప్రైవేటీకరించేది లేదు

Published Mon, Jan 19 2015 12:06 PM

రైల్వేశాఖను ప్రైవేటీకరించేది లేదు

హైదరాబాద్ : రైల్వేశాఖను ప్రయివేటీకరించేది లేదని  రైల్వేమంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆహ్వానించటం అంటే ప్రయివేటీకరణ అనుకోవటం పొరపాటేనని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కేవలం పెట్టుబడులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు సురేష్ ప్రభు చెప్పారు. రైల్వేల్లో సమస్యల పరిష్కారానికి పెట్టుబడులు అవసరమని ఆయన అన్నారు. కేంద్రం ఆధీనంలోనే రైల్వే శాఖ ఉంటుందని సురేష్ ప్రభు తెలిపారు. రైల్వేలను సాంకేతికపరంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

Advertisement
Advertisement