అజ్ఞాతంలోకి ‘డాన్’
అఫ్ఘాన్-పాక్ సరిహద్దుకు స్థావరం తరలింపు
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనపై భయంతో మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి ముఠా సభ్యులు అజ్ఞాతంలోకి పారిపోయారు. కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన దావూద్ తన డెన్ను అఫ్ఘాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబన్ల అధీనంలోని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అధికారంలోకి వస్తే దావూద్ ను పాకిస్థాన్ నుంచి భారత్కు పట్టి తెస్తానని మోడీ ఎన్నికల ప్రచారంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మోడీ సర్కారు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనుండటంతో దావూద్పై నిఘా కట్టుదిట్టం చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ భయంతోనే దావూద్ తన స్థావరాన్ని మారుమూల ప్రాంతానికి తరలించుకుని, ఐఎస్ఐ ద్వారా భద్రతను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
ముంబైలోని అతడి ముఠా సభ్యులు సైతం నగరాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మోడీ అధికారంలోకి వస్తుండటంతో దావూద్లో ప్రాణభయం పెరిగిందని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, దావూద్ను పట్టుకునేందుకు మోడీ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధినేత అజిత్ దోవల్ సేవలను కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దోవల్ ప్రస్తుతం ఢిల్లీలోని వివేకానంద కేంద్రంలో పనిచేస్తున్నారు. పాకిస్థాన్ పట్ల బీజేపీ ఇప్పటికే తన కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఇటీవల ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ సైతం దావూద్ ఆచూకీని కనుగొనడంతో కొత్త ప్రభుత్వానికి సహకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
దావూద్ ముఠాకు మోడీ దడ
Published Wed, May 21 2014 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement