మంచి పాత్ర చేశాను | Sakshi
Sakshi News home page

మంచి పాత్ర చేశాను

Published Mon, Jul 20 2020 2:13 AM

My Role in 22 Movie Will be very Different - Sakshi

‘‘దర్శకుడు పూరి జగన్నాథ్‌గారి ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాలో విలన్‌గా చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఆయన శిష్యుడు శివకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘22’ సినిమాలో మెయిన్‌ విలన్‌గా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌జీత్‌  విర్క్‌. రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా జంటగా తెరకెక్కిన చిత్రం ‘22’.

పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, మారుతిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై సుశీలాదేవి నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్‌జీత్‌ విర్క్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ఆదివారం విక్రమ్‌జీత్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘22’ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదలచేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. విక్రమ్‌జీత్‌ విర్క్‌ మాట్లాడుతూ – ‘‘మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కథ వినగానే చాలా ఎగ్జయిట్‌ అయ్యి ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. నాది చాలా మంచి పాత్ర. వైవిధ్యంగా ఉంటుంది. శివ చాలా ప్రతిభ ఉన్న దర్శకుడు’’ అన్నారు.

Advertisement
Advertisement