ఖుషీఖుషీగా కీర్తి సురేశ్ | Sakshi
Sakshi News home page

ఖుషీఖుషీగా కీర్తి సురేశ్

Published Fri, Nov 17 2017 9:35 AM

Keerthy Suresh happy on 1 million followers in twiiter - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్ : దక్షిణాది నటి, 'నేను శైలజ' ఫేం కీర్తి సురేశ్ చాలా హ్యాపీగా ఉన్నారు. తనకు మద్ధతుగా నిలిచిన వారికి, తనను ఆదరించిన అందరికీ ఆమె సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అసలు విషయం ఏంటంటే.. కీర్తి సురేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఫాలోయర్లు 10 లక్షలు(1 మిలియన్) మార్క్‌ను గురువారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఫాలోయర్లు, అభిమానులతో ఈ శుభవార్తను షేర్ చేసుకున్నారు.

'గత నాలుగేళ్లుగా నన్ను ఎంతగానో ఆదరించారు. నేడు 1 మిలియన్ మార్క్ చేరుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 5వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాను. మరెంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాకు మద్ధతు ఇచ్చిన వారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు' అంటూ తన సినిమాల్లోని కొన్ని స్టిల్స్‌ ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ బొద్దుగుమ్మ కీర్తి సురేశ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఆమె ప్రస్తుతం సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’, పవన్‌కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న సినిమా, తమిళంలో విక్రమ్‌ సరసన సామీ2, మలయాళం సినిమా ‘కుంజిరామంటే కుప్పాయం’  మూవీల షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement