చెన్నై : అలాంటి అవకాశం కూడా లేకుండా పోతోంది అని అంటోంది నటి కీర్తీసురేశ్. చాలా తక్కువ కాలంలో ఎక్కువ పేరును తెచ్చుకున్న నటి కీర్తీసురేశ్. దక్షిణాదిలో విజయపరంపరను కొనసాగిస్తూ ఉత్తరాది చిత్ర పరిశ్రమలో అదృష్టం పరిక్షించుకోవడానికి అక్కడ మకాం పెట్టిన కీర్తీసురేశ్ తన సక్సెస్ రహస్యాన్ని బయట పెట్టింది. తన సినీ జీవితం గురించి కీర్తీసురేశ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినిమా రంగంలో నిలదొక్కుకోవడం తన అదృష్టంగా పేర్కొంది. ప్రతిభావంతులెందరో ఉండగా మహానటి చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం తనను వెతుక్కుంటూ రావడం అదృష్టం అనకుండా ఎలా ఉంటానని అంది.
ఆ చిత్ర కథను అర్థం చేసుకుని కష్టపడి నటించానని, అందుకు ఫలం అనుభవించానన్న ఆనందాన్ని వ్యక్తం చేసింది. నిజం చెప్పాలంటే తన గురించి తాను వెనక్కు తిరిగి ఆలోచించుకునే టైమ్ కూడా లేదని చెప్పింది. తాను నటించిన చిత్రం విడుదలైన తరువాత అందులో ఎలా నటించాను, అంత కంటే ఇంకా బాగా నటించవచ్చా అని ఆలోచించడానికి కూడా టైమ్ ఉండడం లేదని అంది. అయితే కథల ఎంపికలో మాత్రం శ్రద్ధ చూపుతున్నానని తెలిపింది. అందులోనూ కథ వినగానే అందులో తన పాత్ర ఏమిటన్నది కాకుండా కథ బాగుందా? అన్నదాని గురించే ఆలోచిస్తానని చెప్పింది. కథ బాగుంటే అందులో తానుంటే చాలు అని భావిస్తానని అంది. చిత్ర విజయానికి కథే ముఖ్యం అని పేర్కొంది. ఆ తరువాతనే తన పాత్ర గురించి ఆలోచిస్తానని చెప్పింది. కథల ఎంపికలో తన తారక మంత్రం ఇదేనని కీర్తీసురేశ్ చెప్పింది. అన్నట్టు చిన్న గ్యాప్ తరువాత ఈ బ్యూటీ కోలీవుడ్లో నటించనున్న చిత్రంలో యువ నటుడు ఆదితో రొమాన్స్ చేయనుంది.
కథ బాగుంటే చాలు
Published Thu, May 16 2019 8:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement