‘‘మన మనసు రాయిలాంటిది. మంచి పాట విన్నప్పుడు అది ఇట్టే కరిగిపోతుంది. అందుకే సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు’’ అని ఓ సందర్భంలో స్వరజ్ఞాని ఇళయరాజా అన్నారు. నిజమే... ఆయన పాటలకు మనసు కరగకుండా ఉంటుందా.. చెవులు కోసుకోనివాళ్లుంటారా? ఈ మ్యూజిక్ మేస్ట్రో దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిత్య సంగీత సాధకునిగా కొనసాగుతున్నారు. ముప్ఫయ్, నలభైఏళ్ల క్రితం ఆయన పాట ఎంత తాజాగా ఉండేదో ఇప్పుడూ అలానే ఉంటుంది. అందుకే, ఇళయరాజా భారతదేశం గర్వించదగ్గ సంగీతదర్శకుడంటే అతిశయోక్తి కాదు. ఈ మేస్ట్రో నేటితో 71వ ఏట అడుగుపెడుతున్నారు. స్వతహాగా నిరాండబరంగా ఉండే ఇళయరాజా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారు.
ఓ సందర్భంలో తన జీవన శైలి గురించి ఇళయరాజా చెబుతూ.. ‘‘నేనెప్పుడూ నా గురించి చాలా తక్కువగా అనుకుంటాను. ఈ లోకంలోకి వచ్చేశాం... ఏదో సాధించేశాం అనే ఫీలింగ్ లేదు. పాటే నా ప్రపంచం. ఆడంబరాలు నాకు పడవు’’ అన్నారు. ఇళయరాజా పుట్టినరోజు జరుపుకోకపోయినా, ఆయన అభిమానులు మాత్రం వేడుకలు చేస్తుంటారు. పైగా, ఈసారి ఇళయరాజా అభిమానుల సంఘం కూడా ఉంది. ఈసారి ఏంటీ? ఇంతకుముందు అభిమాన సంఘం లేదా? అనే సందేహం రావచ్చు. నిజంగానే లేదు. ఎందుకంటే, గతంలో ఎంతోమంది అభిమానులు అభిమాన సంఘం ఆరంభిస్తామని ముందుకొచ్చినా ఇళయరాజా అంగీకరించలేదు. ఇటీవలే పచ్చజెండా ఊపారు.
దాంతో అధికారికంగా అభిమాన సంఘం ఆరంభమై దాదాపు మూడు నెలలవుతోంది. స్వలాభం కోసం కాకుండా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం కోసమే ఈ సంఘానికి అనుమతించారు ఇళయరాజా. ఈ క్రమంలో ఇళయరాజా 71వ పుట్టినరోజుని పురస్కరించుకుని తమిళనాడులోని వివిధ నగరాల్లో గల అభిమాన సంఘాలకు చెందినవారు 71 వేల చెట్లు నాటాలని నిర్ణయించుకున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశలో అభిమానులు ఈ మహత్కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షణా బాధ్యతలను కూడా అభిమానులే స్వీకరించనున్నారు. దాదాపు కోటి మంది సభ్యులున్న ఈ అభిమాన సంఘం భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేయాలనుకుంటోంది. తన పాటతో ఇళయరాజా అందర్నీ ఆహ్లాదానికి గురి చేస్తుంటే... ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆయన అభిమానులు ఇలా చెట్లు నాటాలనుకున్నారు. ఇదంతా మా రాజాగారి స్ఫూర్తితోనే అంటున్నారు అభిమానులు.
ఏడు పదుల వయసు...డెభై ఒక్క వేల చెట్లు!
Published Sun, Jun 1 2014 10:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement