ప్యాకప్‌! | Sakshi
Sakshi News home page

ప్యాకప్‌!

Published Mon, Jan 27 2020 3:34 AM

Director Radha Krishna Kumar opens up about Prabhas new movie - Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ నిర్మిస్తున్నాయి. కృష్ణంరాజు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం మూడో షెడ్యూల్‌కి శనివారంతో ప్యాకప్‌ చెప్పారు.  తదుపరి షెడ్యూల్‌ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ‘‘మూడో షెడ్యూల్‌ పూర్తి చేశాం. ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డిగారు వేసిన భారీ సెట్‌ను కెమెరామేన్‌ మనోజ్‌ పరమహంస అద్భుతంగా తన కెమెరాలో బంధించారు. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు రాధాకృష్ణ. హైదరాబాద్‌లోనే మూడు నెలల పాటు షూటింగ్‌ జరిపి ఆ తర్వాత ఆస్ట్రియాలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసింది చిత్రబృందం.

Advertisement
Advertisement