ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

Published Sat, Sep 19 2015 1:58 PM

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే - Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నెల 25లోపు హోదాపై ప్రకటన చేయాలని లేకుంటే 26 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో నివరధిక నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నారని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ  ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలన్నారు.

గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ కంటితుడుపు చర్చేనని బొత్స వ్యాఖ్యానించారు. కమిటీకి ఆరు నెలలు గడువు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం పంచ భూతాలను కూడా దోచుకుంటోందని, ఏపీలో జరుగుతున్న అవినీతిలో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నలు సంధించారు.  పట్టిసీమలో చంద్రబాబు దోపిడీ ఎంతో చెప్పాలన్నారు. చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి, తన సహచరుల అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అధికారులను బలి పశువులుగా చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఇంత అవినీతి జరుగుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement