- శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు
- కోలుకుంటున్న బాధితురాలు
హైదరాబాద్: తీవ్రమైన కడుపునొప్పితో ఓ మహిళ నెల రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరికి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అయితే వైద్యులు ఆమె కడుపులో ఆరు అంగుళాల కత్తెర భాగాన్ని గుర్తించారు . 12 మంది వైద్యుల బృందం సుమారు రెండు గంటలు శ్రమించి దానిని బయటకుతీసింది. కాగా తన కడుపులోకి కత్తెర ఎలా వచ్చిందో తెలియదని సదరు మహిళ చెప్పడం గమనార్హం. మెదక్ జిల్లా నారాయణఖేడ్కు చెందిన స్వప్న(30), హుస్సేన్ భార్యాభర్తలు. కూలి పనులు చేస్తు జీవనం కొనసాగిస్తున్న వీరికి నలుగురు పిల్లలు. నెలరోజులుగా స్వప్న తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. నారాయణఖేడ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత చూపించుకుంది. వైద్యుల సూచన మేరకు పటాన్చెరులోని మరో ఆస్పత్రిలో చేరింది.
అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 11న గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఎక్స్రేతోపాటు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వప్న కడుపులో ఆరు అంగుళాల ఇనుప వస్తువును గుర్తించారు. శస్త్రచికిత్స లేకుండా ఇనుప వస్తువును బయటకు తెచ్చేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. మలవిసర్జనతోపాటు అది బయటకు వచ్చేలా తొలుత తగిన వైద్యం(ఎనిమా) అందించారు. అయితే కడుపులో ఉన్న వస్తువు అడ్డం తిరిగింది. ప్రతిరోజు తీసిన ఎక్స్రేల్లో కడుపులోని పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చింది.
పదునైన ఇనుప వస్తువు కావడం.. అది అడ్డంగా తిరగడంతో నరాలు, ప్రేగులకు గుచ్చుకుంటే ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు.. ఈ నెల 17న శస్త్రచికిత్స నిర్వహించి మహిళ కడుపు నుంచి కత్తెర భాగాన్ని విజయవంతంగా బయటకు తీశారు. ఇదిలా ఉండగా తన కడుపులోకి కత్తెర భాగం ఎలా వచ్చిందో తెలియదని స్వప్న ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే కొద్దినెలలుగా మానసిక రుగ్మతలకు గురైన స్వప్న కత్తెర భాగాన్ని మింగి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, స్వప్న కోలుకుంటోందని, త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జేవీ రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు పీవీ చలం, కృష్ణమోహన్, రాజ్కరణ్, సిద్దిపేట రమేష్, శ్రీదేవి, పీజీలు ప్రవీణ, స్వప్న, సునీత, హిమజ, చంద్రారెడ్డి, అష్లేష్, సింధూరలను ఆయన అభినందించారు.
మహిళ కడుపులో కత్తెర..!
Published Wed, Jun 22 2016 11:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement