► సుమారు రూ. 10 కోట్లతో చిట్టీ వ్యాపారి పరార్
► కేసు నమోదు
నేరేడ్మెట్: జనం నుంచి సుమారు రూ.10 కోట్లు దండుకొని చిట్టీల వ్యాపారి పరారైంది. నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ జగదీష్చందర్ కథనం ప్రకారం... మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రఘునాథ్రెడ్డి, అరుణారెడ్డి దంపతులు 25 ఏళ్లుగా నేరేడ్మెట్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో ఉంటున్నారు. రఘునాథ్రెడ్డి మాజీ సైనికుడు కాగా.. అరుణారెడ్డి చిట్టీల వ్యాపారం చేస్తోంది. రూ. లక్ష నుంచి 10 లక్షల చిట్టీలు వేస్తోంది. చిట్టీ ముగిసిన వారికి, పాడుకున్న వారికి మొదట్లో సవ్యంగానే డబ్బు చెల్లించేది. ఆ తర్వాత చిట్టీ పూర్తయిన వారికి అధిక వడ్డీ ఆశ చూపి డబ్బు చెల్లించకుండా తన వద్దే ఉంచుకొనేది.
అంతేకాకుండా వడ్డీ డబ్బుతో తన వద్దే మరో చిట్టీ వేసేలా వారిని ఒప్పించేది. అయితే, కొందరు తమకు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఈవేళ, రేపంటూ అరుణారెడ్డి తన ఇంటి చుట్టూ తిప్పించుకుంది. దీంతో వారు తక్షణం డబ్బు చెల్లించాలని ఇటీవల ఒత్తిడి చేయడంతో ఓ స్థలం విక్రయించామని, మే 3వ తేదీని దానికి సంబంధించిన డబ్బు తమ చేతికి వస్తుందని, ఆరోజు అందరికీ చెల్లిస్తానని నమ్మబలికింది.
ఇదిలా ఉండగా.. గత సోమవారం అరుణ కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సుమారు 50 మంది బాధితులు ఆదివారం డిఫెన్స్ కాలనీలోని అరుణారెడ్డి ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు. చిట్టీలు వేసిన సుమారు వంద మందికి దాదాపు రూ. 30 కోట్ల వరకు అరుణారెడ్డి చెల్లించాల్సి ఉందని బాధితులు తెలిపారు. బాధితుల్లో కొందరికి రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు బాకీ ఉందని చెప్పారు. అనంతరం బాధితులు నేరేడ్మెట్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేయగా, చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిండా ముంచేసింది
Published Mon, May 2 2016 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement