రాష్ట్రానికి పోరాడే సీఎం కావాలి | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి పోరాడే సీఎం కావాలి

Published Thu, May 19 2016 3:02 AM

రాష్ట్రానికి పోరాడే సీఎం కావాలి - Sakshi

అడుక్కునే ముఖ్యమంత్రి కాదు: రఘువీరా

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అడుక్కునే సీఎం కాదు.. పోరాడే ముఖ్యమంత్రి కావాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు అనుభవం చూసి ఓటెయ్యండని నమ్మించి, అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఇప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నానని వాపోవడం విడ్డూరమన్నారు. బుధవారం ఇందిర భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జవసత్వాలు వీగిపోయి చేవలేని పరిస్థితుల్లో ఉన్నారని మండిపడ్డారు.

టీడీఎల్పీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పోరాడే వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవాలని రఘువీరా సలహా ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసినా నిధులు రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఒక్కమాటైనా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండటం దారుణమన్నారు. మూడు రోజుల్లో మరో ‘రాజకీయ బాంబు’ పేలుస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అనడంతో చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు.

Advertisement
Advertisement