ఓటర్లను తొలిగిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు | Sakshi
Sakshi News home page

ఓటర్లను తొలిగిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు

Published Mon, Oct 5 2015 7:12 PM

ఓటర్లను తొలిగిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు - Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్లో ఓటర్లను తొలగిస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

నగరంలో కేవలం బోగస్ ఓట్లు మాత్రమే తొలగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఎవరైనా నివసించవచ్చన్నారు. హైదరాబాద్లో గత 15 నెలలుగా స్థానికత అంశంపై ఎలాంటి వివాదం జరగలేదని ఆయన గుర్తు చేశారు. భారతీయులు ఎవరైనా హైదరాబాద్లో జీవించవచ్చని కేటీఆర్ వెల్లడించారు.

Advertisement
Advertisement