ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Published Thu, Feb 4 2016 7:20 AM

Woman dies RTC bus hits while crossing road

కొత్తకోట(మహబూబ్‌నగర్): ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 29 జడ్ 1032) కనిమెట్ట వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement