ఉత్తరాఖండ్ మృతులకు నివాళి


నందికొట్కూరుటౌన్, న్యూస్‌లైన్: ఉత్తరాఖండ్ మృతులకు స్థానిక క్రిష్ణవేణి పాఠశాల విద్యార్థులు బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జయచంద్ర మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో వేల మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం చాలామంది బాధితులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారని, వారిని ఆదుకుని క్షేమంగా స్వస్థలాలకు చేర్చాలని కోరారు.  

 

 ఉత్తరాఖండ్ బాధితులకు లక్ష విరాళం

 ఆదోని టౌన్, న్యూస్‌లైన్: ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం ఆదోని కాటన్‌మర్చంట్స్ అసోసియేషన్ తరఫున రూ. లక్ష విరాళం అందజేసినట్లు సంఘం అధ్యక్షులు కునిగిరి నారాయణప్ప, కార్యదర్శి వెంకట రమణారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌రావు, కోశాధికారి సూగురప్ప ఓప్రకటనలో తెలిపారు. బుధవారం కర్నూలులో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి చెక్కును అందజేశామని, ఆయన ప్రధాన మంత్రి సహాయ నిధికి పంపుతారన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top