ఆరోసారి..అదే రికార్డు | Sakshi
Sakshi News home page

ఆరోసారి..అదే రికార్డు

Published Sun, May 7 2017 12:01 AM

ఆరోసారి..అదే రికార్డు

- వందశాతం ఉత్తీర్ణ సాధించిన కనుకుంట్ల జెడ్పీ హైస్కూల్‌
 
కునుకుంట్ల (అవుకు): మండల పరిధిలోని కునుకుంట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గత ఆరు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ అందరి మన్ననలు పోందుతోంది. శనివారం పదో తరగతి ఫలితాలు విడుదల సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం వి.సుబ్బారాయుడు  విలేకర్లతో మాట్లాడారు. 2016–17 సంవత్సరానికి 23 మంది విద్యార్థులకు గాను 23 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అందులో ఎల్‌.కావేరి–9.0, జె.మౌనిక, జి. విమల –8.8 జీపీఏ సాధించారన్నారు. 2011–12లో 22కు 22, 2012–13లో 18 కి 18, 2013–14లో 15 కి15, 2015–16కు 24 కి24 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉపాధ్యాయుల సమష్టి కృషే ఇందుకు కారణమని చెప్పారు. 
 

Advertisement
Advertisement