కాంగ్రెస్, టీడీపీలు మాట్లాడేవన్నీ అబద్ధాలే | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీలు మాట్లాడేవన్నీ అబద్ధాలే

Published Sun, Jun 26 2016 8:04 AM

కాంగ్రెస్, టీడీపీలు మాట్లాడేవన్నీ అబద్ధాలే - Sakshi

ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్: మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసే మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు గ్రామాల్లో తిరగలేరని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్, టీడీపీ నేతలు మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు.


టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గరుండి కట్టించిన పులిచింతల ప్రాజెక్టు కింద తెలంగాణలో ఒక్క ఎకరా భూమికి కూడా నీరు అందకపోగా, వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. భూసేకరణలో రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే జీవో 123ను ప్రభుత్వం జారీ చేసిందన్నారు.

 

 

Advertisement
Advertisement