ఆ రెండు హామీలు నెరవేరిస్తే..టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తా : జానా | Sakshi
Sakshi News home page

ఆ రెండు హామీలు నెరవేరిస్తే..టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తా : జానా

Published Mon, Jul 4 2016 8:02 AM

ఆ రెండు హామీలు నెరవేరిస్తే..టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తా : జానా - Sakshi

యాదగిరికొండ : నాగార్జునసాగర్ కింద ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామని, ముస్లింల కు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన  హామీలను నెరవేర్చినట్లయితే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేస్తానని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు.

ఆదివారం యాదాద్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆ రెండు హామీలు అమలు చేయకుంటే టీఆర్‌ఎస్ వారు దేనికి సిద్ధమని ప్రశ్నిం చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతున్నామని, కానీ టీఆర్‌ఎస్ నేతలు ప్రతిపక్షాలను తిట్టడ మే పనిగాపెట్టుకున్నారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement