♦ 120 ఎకరాల అటవీ భూమి దేవస్థానానికి ఇవ్వాలని నిర్ణయం
♦ ఆ స్థలంలో దేవతా, వనమూలికల చెట్ల పెంపకం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అటవీశాఖ భూమి మొత్తం దుర్గమ్మకు సొంతం కానుంది. ఈ మేరకు అటవీ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకుఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఇంద్రకీలాద్రి సుమారు 300 ఎకరాల్లో ఉన్నా..దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కేవలం ఏడెనిమిది ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన పర్వతమంతా అటవీ శాఖ ఆధీనంలో ఉంది. దీన్ని అటవీశాఖ పట్టించుకోకపోవడంతో చాలా భాగం అన్యాక్రాంతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిని అటవీ శాఖ కంటే దుర్గగుడి ఆధ్వర్యంలోనే ఉంచడం మంచిదని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ‘సాక్షి’కి తెలిపారు.
ప్రస్తుతం ఉన్నది 120 ఎకరాలే
ఇంద్రకీలాద్రిపై అటవీ శాఖకు ప్రస్తుతం 120 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కొండపై ఇప్పటికే కొంతమంది ఇళ్లు నిర్మించుకోవడంతో చాలా భాగం ఆక్రమణలకు గురయ్యింది. దుర్గగుడి వెనుక నుంచి సైతం ఇళ్ల నిర్మాణం సాగుతోంది. దీంతో ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో దేవాలయం భద్రతకే ముప్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దేవస్థానంపై ఉగ్రవాదుల కన్ను ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కొండ మొత్తాన్నీ దుర్గగుడి ఆధీనంలోకి తేవాలని నిర్ణయించారు.
అర్జునుడు తపోవనానికి మెట్లు
అటవీ శాఖ నుంచి తీసుకునే భూమి చుట్టూ రక్షణగోడ కట్టనున్నట్లు ఈవో ఆజాద్ తెలిపారు. సింహాచలంలో ఎనిమిది కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించారని, ఇక్కడ 120 ఎకరాల్లో నిర్మించడం కష్టం కాదన్నారు. అలాగే దేవస్థానం ప్రాంగణంలో శ్రీశైలం, తిరుమల తరహాలో దేవతా, వనమూలికా వృక్షాలు పెంచాలని నిర్ణయించారు. అమ్మవారి పూజలకు అవసరమయ్యే పూల మొక్కలు, చెట్లను పెంచే ఆలోచనలో ఉన్నారు. కొండపై అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశంలోని పురాతన గుడిని అభివృద్ధి చేసి అక్కడికి మెట్ల మార్గం ఏర్పాటు చేయనున్నారు.
ఈశాన్యంలో కోనేరు...
దేవాలయానికి తూర్పున ఇప్పటికే భారీ ఎత్తున రాజగోపురం నిర్మించారు. దానికి పక్క గా ఈశాన్యంలో కిందివైపుకోనేరు నిర్మిస్తే.. వాస్తురీత్యా బాగుండటంతో పాటు భక్తుల స్నానాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొండ పైనుంచి కోనేరులో పడేలా కృత్రిమ వాటర్ ఫాల్స్(జలపాతం) ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ ప్రాంతం చక్కటి పర్యాటక ప్రాంతంగా మారనుంది.
ఆదిశంకరుల విగ్రహాలు...
ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు వైపు ఆదిశంకరాచార్యులు నలుగురు శిష్యులకు ఉపదేశం చేస్తున్నట్లుండే విగ్రహాలను చెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రి అటవీశాఖ ఆధ్వర్యంలో ఉండటంతో ఇది పూర్తిగా సాధ్యపడలేదు. ఇప్పుడు దేవస్థానం ఆధ్వర్యంలోకి వస్తే ఆదిశంకరాచార్యుల విగ్రహాలు జాతీయ రహదారిపై వెళ్లే వారికి కనపడేలా ఏర్పాటుచేయిస్తామని ఈవో ఆజాద్ తెలిపారు.
ఇంద్రకీలాద్రి అంతా దుర్గమ్మకే
Published Sat, Mar 26 2016 7:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement