పాట్నా: బీహార్లోని నవడా జిల్లాలోని ఓ ఆశ్రమంలో ముగ్గురు శిష్యురాళ్లపై సామూహిక లైంగిక దాడి జరిగింది. సంత్ కుటీర్ ఆశ్రమంలోని కొందరు సేవాదార్లు డిసెంబర్ 12-17 మధ్య కాలంలో తమపై పలుమార్లు ఆశ్రమంలోనే అత్యాచారం జరినట్లు ముగ్గురు మహిళలు తమకు ఫిర్యాదు చేశారని జిల్లా పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 12వ తేదీన తాము వంటశాలలో భోజనం తయారీలో నిమగ్నమై ఉండగా సేవాదార్లులో కల్పానాథ్ చౌదరి, గిరిజాశంకర్ చౌదరి, తపస్యానంద్, షీట్ చౌదరి అనేవారు బలవంతంగా లోపలికి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించి తుపాకులు ఎక్కుపెట్టి తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళలు వివరించారన్నారు. బాధితులు ఈనెల 4వ తేదీన తమకు ఫిర్యాదు చేశారని, నిందితులపై కేసు నమోదు చేశామని, వారంతా ఉత్తర్ప్రదేశ్లోని బస్తీ జిల్లానుంచి వచ్చిన వారని, పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. వీరి కోసం గాలించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు నవడా ఎస్పీ వికాస్ బర్మన్ తెలిపారు. విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారంటూ బాధితులు గురువారం నవడా సివిల్ కోర్టులో తమ వాంగ్మూలాలు ఇచ్చారని, వారికి సదర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించామని వివరించారు. కాగా, ఆశ్రమంలో ఇలాంటి అకృత్యాలు ఇదే మొదటిసారి కాదని, కొన్ని నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారం జరిగిందని, తుపాకితో బెదిరించడంతో ఆమె మౌనం వహించిందని, కొంతమంది ఎదురు తిరగగా నిందితులు కాల్పులు జరపడంతో ఒకరు గాయపడ్డారని ఈ ముగ్గురిలో ఓ మహిళ చెప్పింది. ఆశ్రమంలో 50మంది మహిళలు, డజను మంది పురుషులు ఉంటారని, ఆరేళ్లుగా ఈ ముగ్గురు అక్కడ ఉంటున్నారని పోలీసు అధికారి తెలిపారు.
ఆశ్రమంలో శిష్యురాళ్లపై లైంగిక దాడులు
Published Fri, Jan 12 2018 3:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement