తల్లి, కూతురు అదృశ్యం | Sakshi
Sakshi News home page

తల్లి, కూతురు అదృశ్యం

Published Sat, Jul 6 2019 8:27 AM

Mother And Girl Child Commits Suicide in Hyderabad - Sakshi

నల్లకుంట: కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికిలోనైన ఓ మహిళ నాలుగేళ్ల కుమార్తెతో సహా అదృశ్యమైన సంఘటన నల్లకుంట పీఎస్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలి ఉన్నాయి. మల్లేష్‌ అనే వ్యక్తి భార్య గంగ(24), కుమార్తె అక్షయ(4)తో కలిసి నల్లకుంట తిలక్‌నగర్‌ బస్తీలో ఉంటున్నాడు. తరచూ భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో గంగ గత ఏడాది నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మల్లేష్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. ఈ నెల 4న డ్యూటీకి  వెళ్లిన గణేష్‌ మధ్యాహ్నం భార్యతో మాట్లాడేందుకు పక్కింటి ఆంటీకి ఫోన్‌ చేయగా,  గంగ ఇంట్లోలేదని చెప్పింది. దీంతో ఇంటికి వచ్చిన మల్లేష్‌ వారి కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement