మూడు రోజుల నష్టాలకు శుక్రవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటానికి తోడు రూపాయి రికవరీ జత కావడంతో స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్న నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 35,673 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 10,694 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆర్థిక రంగ, వాహన, వినియోగ షేర్లు లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 521 పాయింట్లు, నిఫ్టీ 183 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
ప్రపంచ మార్కెట్ల జోరు...
రేట్ల పెంపు గతంలోలాగా జోరుగా ఉండదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ సంకేతాలివ్వడం ప్రపంచ మార్కెట్లలో జోరును పెంచింది. మరోవైపు సమీప భవిష్యత్తులో అమెరికాలో ఆర్థిక వృద్ధి తగ్గే అవకాశాల్లేవని ఐఎమ్ఎఫ్ చీఫ్ క్రిస్టినా లగార్డే వ్యాఖ్యానించడం కూడా కలసివచ్చింది. డాలర్తో రూపాయి మారకం 24 పైసలు బలపడి 70.66కు ఎగియడం(ఇంట్రాడేలో) ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చింది. లాభాల్లోనే ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 418 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. మార్కెట్లో అప్రమత్తత: ఈ వారంలో స్టాక్మార్కెట్లో అప్రమత్త వాతావరణం కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ నాయర్ పేర్కొన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుందని వివరించారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గగలవనే అంచనాలు, ముడి చమురు ఉత్పత్తి కోత విషయంలో నిర్ణయాన్ని ఒపెక్ జాగు చేయడం కూడా కలసిరావడంతో ప్రపంచ మార్కెట్లు రివకరీ అయ్యాయని తెలిపారు. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా లాభపడిందని వివరించారు.
కోటక్ బ్యాంక్పై బఫెట్ కన్ను?
అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హతావే, కోటక్ మహీంద్రా బ్యాంక్లో 10 శాతం వరకూ వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 10 శాతానికి పైగా పెరిగి, రూ.1,345ను తాకిన ఈ షేర్ చివరకు 8.5 శాతం లాభంతో రూ.1,282 వద్ద ముగిసింది. సెన్సెక్స్ మొత్తం 361 పాయింట్ల లాభంలో ఈ షేర్ వాటా 119 పాయింట్లుగా ఉంది. కోటక్ బ్యాంక్లో హతావే సంస్థ 400 కోట్ల డాలర్ల నుంచి 600 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను కోటక్ బ్యాంక్ ఖండించింది.
ఐబీఎమ్ కంపెనీకి చెందిన రూ.12,700 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అంతా నగదులోనే ఉండటంతో ఈ షేర్ 5 శాతం నష్టంతో రూ.962 వద్ద ముగిసింది. కోల్ ఇండియా, సెయిల్, భెల్, ఆయిల్ ఇండియా, టాటా మోటార్స్, రిలయన్స్ క్యాపిటల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, తదితర షేర్లు ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.
సెన్సెక్స్ 361 పాయింట్లు అప్
Published Sat, Dec 8 2018 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ రేసులోకొచ్చింది!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
తల్లడిల్లుతున్నారు..!
భారత బాక్సర్ల పసిడి పంచ్
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement