నేడు వైఎస్సార్ సీపీపీ భేటీ | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్ సీపీపీ భేటీ

Published Sat, Jul 18 2015 2:39 AM

ysrcp parliamentary meeting today

- ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న వైఎస్ జగన్

సాక్షి, హైదరాబాద్:
ఈ నెల 21న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(వైఎస్సార్ సీపీపీ) సమావేశం కానుంది.

 

హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరిగే సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన అంశాలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement