యువతిపై మోజుతో నగరానికి చేరిన భీమవరం వాసి
పోలీసులమంటూ బెదిరించి బంగారం దోచుకున్న ముగ్గురు యువకులు
పోలీసుల అదుపులో ముగ్గురు
చిట్టినగర్ : పోలీసులమంటూ ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని బెదిరించి ఏడు కాసులకు పైగా బంగారాన్ని దోచుకున్నారు. కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని జక్కంపూడిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మధు అనే యువకుడికి హైదరాబాద్లో ఉంటున్న మజ్జి పద్మ(26) అనే యువతితో ఫేస్బుక్లో పరిచయం అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన పద్మకు తల్లిదండ్రులు లేకపోవడంతో కొంత కాలం గా హైదరాబాద్లో ఉంటుంది. పద్మతో పాటు విజయవాడ కొత్తూరు తాడేపల్లికి చెందిన రాజశేఖర్ అనే యువకుడితో మధుకు ఫేస్బుక్లో పరిచయం ఉండేది. పద్మ, మధుల మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో విజయవాడకు గురువారం వస్తున్నానని చెప్పిన పద్మను కలుసుకునేందుకు మధు గురువారం నగరానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లిలోని మామిడి తోటకు వెళ్లారు. జక్కంపూడి, షాబాద్ గ్రామాలకు చెందిన రాజేష్, మరో ఇద్దరు యువకులు తోటలోకి వచ్చి పోలీసులమంటూ హడావుడి చేశారు. వీరిలో ఒకరు తాను కొత్తపేట ఎస్సైనని బెదిరించాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నిం చాడు. దీంతో మధు బెదిరిపోయాడు. అతడి చేతికి ఉన్న బ్రాస్లెట్తో పాటు మెడలోని గొలుసు, చేతి ఉంగరాలు మొత్తం ఏడు కాసుల బంగారాన్ని బలవంతంగా లాక్కున్నారు. మధు, పద్మ నగరానికి తిరిగివస్తూ మార్గమధ్యంలో ఎదురైన పోలీసులకు విషయం తెలిపారు. వారు వెంటనే రాజేష్తో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనలో రాజశేఖర్ది కూడా కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రాజశేఖర్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లినట్లు తెలి సింది. ఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత నిందితులను అరెస్టు చూపే అవకాశాలున్నాయని స్టేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
వెలుగులోకి మరో కోణం...
అయితే ఈ కేసులో మరో కోణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో ఉంటున్న రాజశేఖర్, యువతితో కలిసి ఫోన్లో మాయమాటలు చెప్పి యువకులను మోసం చేసి బంగారం, డబ్బు గుంజుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. అదే రీతిలో గురువారం హైదరాబాద్ నుంచి నగరానికి యువతి బయలుదేరిన విషయాన్ని రాజశేఖర్ తన మిత్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి నకిలీ పోలీసుల రూపంలో బంగారం దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది. గతంలో ఇదే తరహాలో మరేమైనా ఘటనలకు పాల్పడ్డారా? యువతి ఎంత మందిని మోసం చేసిందనే కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఫేస్బుక్తో బుక్కయ్యాడు
Published Sat, Nov 8 2014 1:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమంగ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement