భూత్పూర్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం జరిగి, శరవేగంగా అభివృద్ధి చెందాలంటే తమ అధినేత కేసీఆర్కు ఆ బాధ్యతలు అప్పగించాలని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. గురువారం భూత్పూర్ లోని మునిరంగస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండలస్థాయి కార్యకర్తల శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణకు సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర పార్టీల నేతలు అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాను జూరాల ద్వారా 100 టీఎంసీల నీటితో సస్యశ్యామలం చేస్తామన్నారు. పొలిట్బ్యూరో సభ్యుడు నిరంజన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను సీమాంధ్ర నే తలు విరమించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పది జిల్లాలను 24 జిల్లాలుగా విభజిస్తామని, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగునీరు అందిస్తామన్నారు. అరవై ఏళ్లుగా సీమాంధ్రులు తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో అణగదొక్కారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.
జిల్లా కన్వీనర్ విఠల్రావు ఆర్యా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేసిందని, ఇప్పుడు టీకాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తామే సాధించామని యాత్రలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు నర్సింహ్మరెడ్డి, నారాయణగౌడ్, కదిరె శేఖర్రెడ్డి, శంకర్రెడ్డి, భూషణ్కుమార్, బస్వరాజుగౌడ్, గొడుగు ఆంజనేయులు, ఆర్.చంద్రమౌళి, రామేశ్వర్రావు, కాట్రావత్ శంకర్నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యం
Published Fri, Nov 22 2013 3:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement