అన్‌–ఎయిడెడ్‌ స్కూళ్లకు అండగా నిలవాలి | Sakshi
Sakshi News home page

అన్‌–ఎయిడెడ్‌ స్కూళ్లకు అండగా నిలవాలి

Published Thu, Sep 13 2018 6:50 AM

Un Aided School Management Meet YS Jagan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రయివేట్‌ ఆస్పత్రులకు రక్షణకు చట్టం చేసినట్టు రాష్ట్రంలో అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల రక్షణకు కూడా చట్టం చేయాలని ఏపీ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ తరఫున ప్రతినిధులు ఎ.బాలరెడ్డి, ఎన్‌.వి.వి. ఎస్‌.పాపారావు నాయుడు, గణేష్‌ కుమార్, ఎం.సూరిబాబు, వై.ప్రసాద్‌ బుధవారం ఆరిలోవలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలకు విద్యుత్‌ సరఫరాకు సంబంధించి కేటగిరి–2 నుంచి 7లోకి మార్చాలన్నారు. స్కూళ్లకు విధిస్తున్న కమర్షియల్‌ ట్యాక్స్, వాటర్‌ ట్యాక్స్, ఆస్తిపన్నులు భారీగా పెంచినందున వీటి తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement