మాజీ సర్పంచ్ హత్య కేసులో గిరిజనుల నిర్బంధం
ఆదివాసీలను రహస్యంగావిచారిస్తున్న పోలీసులు
తమ వారు ఎక్కడున్నారో తెలియక కుటుంబసభ్యుల ఆందోళన
పోలీసులు, మావోయిస్టులకు మధ్య నలుగుతున్న గిరిజనులు
విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం.. అన్నట్టు తయారైంది ఆదివాసీల పరిస్థితి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య వారు నలిగిపోతున్నారు. ఇటీవల మావోలు చేసిన ఓ హత్యకు సహకరించారంటూ పోలుసులు కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. అయితే పోలీసులు తీసుకువెళ్లిన తమవారు ఎక్కడున్నారో తెలియక వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
విశాఖపట్నం/జీకేవీధి: జర్రెల పంచాయతీ మాజీ సర్పంచ్, చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరైక్టర్ సాగిన వెంకటరమణ హత్య కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు మావోలతో కలిసి వచ్చిన గిరిజనులు ఎవరనేదానిపై కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారిని 24గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. కానీ వీరి విషయంలో అలా జరగలేదు. నిజానికి గిరిజనులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు రికార్డుల్లో లేదు. వారిపై ఇంతవరకూ ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దీంతో తమ వారిని పోలీసులు ఏం చేస్తారోనని బాధిత కుటుంబసభ్యులు భయపడుతున్నారు.
నలిగిపోతున్న గిరిజనులు : పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గిరిజనులు ఎప్పటినుంచో నలిగిపోతున్నారు. తమకంటే తమకే సహకరించాలంటూ ఇరువర్గాలు గిరిజనులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ దాని కోసం ఇన్ఫార్మర్లను వినియోగించుకుంటున్న పోలీసులు వారికి భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. దీంతోత ఏడాది కాలంలో నలుగురు గిరిజనులను పోలీసు ఇన్ఫార్మర్లనే కారణంతో మావోయిస్టులు చంపేశారు. ఇప్పుడు మాజీ సర్పంచ్నే మట్టుబెట్టారు. అయితే ఈ దుశ్చర్యకు కూడా గిరిజనులను వెంటతీసుకువెళ్లారు. వెళ్లకపోతే మావోయిస్టుల దృష్టిలో వ్యతిరేకులవుతారు. వెళితే పోలీసుల దృష్టిలో నేరస్థులవుతారు. ఎలా చూసినా గిరిజనులకే నష్టం. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడిన ప్రతిసారీ అనుమానితులంటూ గిరిజనులను పోలీసులు పట్టుకుపోవడం సర్వసాధారణమైపోయింది.
బాక్సైట్ వ్యతిరేకంగా పోరాడుతున్నందునే..
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మావోలతో సంబంధాలు అంటగట్టి చిచ్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై ప్రకటన చేసిన నాటి నుంచి గిరిజనులకు అండగా ఉంటున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో బాక్సైట్ వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నారు. గత నెల 10న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చింతపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేయించారు. ఆ సభకు హాజరైన జన సందోహాన్ని చూసి ఓర్వలేని పాలకపక్ష నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశార ని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై ఫిర్యాదులు చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహంతో ఆమెపై హత్యానేరం, దేశద్రోహం వంటి కేసులు నమోదు చేశారు. బాక్సైట్కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరికి అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కుట్ర పూరితమైన నిర్ణయాలు తీసుకుదనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకుడు సాగిన వెంకటరమణ హత్యకు సంబంధించి అదుపులోకి తీసుకు అమాయక గిరిజనులను విడిచి పెట్టాలని కోరేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఈశ్వరితోపాటు ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు విష్ణుమూర్తి, ప్రసాద్లను విచారణ పేరుతో అదుపులోకి తీసుకొని పోలీసులు నిర్బంధించారు.
విచారించకుంటే ఎలా?
‘మాజీ సర్పంచ్ వెంకటరమణను హత్యచేసిన సంఘనటలో మావోయిస్టులతో పాటు దాదాపు 300 మంది ఉన్నారు. వారిలో వందలాది మంది గిరిజనులేననే సమాచారం మాకుంది. దీనికి సంబధించి పలు ఆధారాలు కూడా మాకు లభించాయి. వాటి ఆధారంగా కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న మాట వాస్తవం. మరి కొందరిని కూడా విచారించాల్సి ఉంది. పూర్తి సమాచారం వచ్చేంత వరకూ దర్యాప్తు చేస్తాం. నేరస్థులు ఎవరనేది తెలుసుకోవడానికి విచారణ జరపడం తప్పనిసరి. దీనికి కొన్ని రోజులు సమయం పట్టడం సహజం. రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం. ఈ లోగా తొందరపడితే అమాయకులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.’
-కోయ ప్రవీణ్, ఎస్పీ, విశాఖపట్నం
ఆరు రోజులైనా.. ఆచూకీ లేదు!
Published Wed, Jan 13 2016 11:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement