నేటి ముఖ్యవార్తలు | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యవార్తలు

Published Sun, Aug 27 2017 10:03 AM

Today News Updates

వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ కాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

భారీ వర్షాలు
నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

గవర్నర్‌ను కలవనున్న డీఎంకే నేతలు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కారణంగా డీఎంకే నేత స్టాలిన్‌, ఎమ్మెల్యేలు నేడు గవర్నర్‌ను కలవనున్నారు.

రాజ్యసభ ప్రత్యేక కమిటీ
రాజ్యసభ ప్రత్యేక కమిటీ రేపు తెలంగాణ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో భేటీ కానుంది.

శ్రీలంకతో మూడో వన్డే
నేడు శ్రీలంక-భారత్‌ల మధ్య మూడో వన్డే జరగనుంది.

టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ
సింగరేణి ఎన్నికలపై చర్చించేందుకు నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం కానున్నారు.

విజయవాడకు సుప్రీం న్యాయమూర్తి
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేడు విజయవాడకు రానున్నారు.

Advertisement
Advertisement