Sakshi News home page

ఏపీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

Published Sun, Feb 1 2015 10:40 AM

Swine flu hulchul in Andhra and Telangana states

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు అనంతపురం, ప్రకాశం జిల్లాలలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు.

కాగా గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో యూసఫ్గూడకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం మరణించాడు. తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో 29 మంది  మరణించారు. మరో 1500 మంది స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడిన పలువురు ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

Advertisement
Advertisement