నకిలీ బంగారం డాలర్లు విక్రయించిన వ్యక్తి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం డాలర్లు విక్రయించిన వ్యక్తి అరెస్ట్

Published Sat, Aug 1 2015 7:25 AM

shankarboi arrest for selling of fake gold dollers

కడప క్రైమ్: నకిలీ బంగారు డాలర్ల విక్రయం కేసులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని కడప సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు రాజాంపేట బైపాస్‌రోడ్డులో పద్మావతి నగర్ క్రాస్ రోడ్డు వద్ద సలాట్ శంకర్ బోయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

అతడి నుంచి రూ.5.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శంకర్‌బోయ్, మరో ఇద్దరు నిందితులు లోగడ సురేంద్రనాథ్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ. 10 లక్షలు తీసుకుని నకిలీ బంగారు డాలర్లను విక్రయించారు. ఈ కేసులో శంకర్‌బోయ్ పట్టుబడగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement