కర్నూలు (హాస్పిటల్): సీమ స్థాయిలో నిత్యం వేలాది మంది రోగులకు సేవలందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమస్యలతో సతమతమవుతోంది. ఏళ్ల నాటి డ్రెయినేజీ వ్యవస్థతో రోగులు నానాఅవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్య పనుల కోసం ఏటా రూ. 2.16 కోట్లు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం కానరావడంలేదు. ఫలితంగా పందుల సంచారం, పారిశుద్ధ్య లోపం కారణంగా రోగు లు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ వందల సంఖ్యలో వివిధ రకాల వైద్య చికిత్సల కోసం రోగులు వస్తుంటారు. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, తిరుపతి, ప్రకాశం, మహబూబ్నగర్, కర్ణాటక, రాయచూరి నుంచి వచ్చే రోగులకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది.
రూ. కోట్లు ఖర్చవుతున్నా అవే సమస్యలు:
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ పనులు చేపట్టేందుకు 2010 అక్టోబర్ 1 నుంచి పజిల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేటు లిమిటెడ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఏజెన్సీ కింద పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 169 మంది వర్కర్లు, 10 మంది సూపర్వైజర్లను నియమించారు. ప్రతి నెలా రూ. 18 లక్షల ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తున్నా పారిశుద్ధ్యం మెరుగుపడటం లేదు. పందులు, కుక్కల బెడద అధికంగా ఉంది. కొందరు స్థానిక లెప్రసీ వార్డు, దోబీ ఘాట్ వద్ద వ్యర్థ పదార్థాలను పడేస్తున్నారు.
మూడు నెలలుగా అందని వేతనాలు:
పారిశుద్ధ కార్మికులకు ఏజెన్సీ నిర్వాహకులు ఏ నెల కూడా జీతాలు సక్రమంగా ఇవ్వడంలేదు. నెలల తరబడిగా జీతాలు లేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఏడాది మార్చికి ఏజెన్సీ గడువు ముగియడంతో కొత్త కాంట్రాక్టు ఇచ్చే వరకు బాధ్యతలను డెరైక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు అప్పగించారు. అప్పటి నుంచి ఏప్రిల్ నెల జీతం ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పారిశుద్ధ్య కార్మికులను కొందరు సిబ్బంది ఇతర పనులకు వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
అధ్వాన్నంగా డ్రెయినేజీ వ్యవస్థ:
వైద్యశాలలో పురాతన కాలం నిర్మించిన డ్రెయినేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది. పలుచోట్ల సిల్ట్ తొలగించలేని పరిస్థితి. ట్రామాకేర్ సెంటర్ సందులో డ్రెయినేజీ దెబ్బతిని మురుగునీరు ఎక్కడికక్కడే స్తంభించింది. అలాగే ఏఆర్టీ నుంచి గైనిక్ వార్డు గేట్ వద్ద డ్రెయినేజీ సక్రమంగా లేదు. అలాగే ఆసుపత్రిలో మామూళ్ల పర్వం యధేచ్ఛగా సాగుతోంది. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. నాలుగేళ్లుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించిన సంస్థకే మరోసారి కాంట్రాక్టు అప్పగించినట్లు సమాచారం.
కొత్త కలెక్టర్ గారూ... దృష్టి పెట్టండి...:
వేలాది మంది రోగులకు వైద్య సేవలందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలపై కొత్త కలెక్టర్ విజయమోహన్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పందులు, కుక్కల సమస్య, అధ్వాన్నంగా డ్రెయినేజీ, పారిశుద్ధ్య సమస్యలపై ఆకస్మిక, విస్తృత తనిఖీలు చేయాలని రోగులు కోరుతున్నారు.
పెద్దాసుపత్రికంపు..కంపు
Published Fri, Aug 1 2014 12:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement