మెద క్ రూరల్, న్యూస్లైన్: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఘర్షణలకు దారి తీస్తోంది. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు పట్టాలు చేసి ఇవ్వడంతో ఆ భూమిలో ఒకరు నాటువేస్తే...మరొకరు గడ్డిమందుకొట్టి పంటను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని హవేళిఘణపూర్కి చెందిన మంగళి రాజయ్యకు లింగ్సానిపల్లి ఊరచెర్వు వెనకాల 98 సర్వే నంబర్లో 7 గుంటల భూమి ఉండేది. రాజయ్య తన భూమిని 1984లో హవేళిఘణపూర్ గిరిజన తండాకు చెందిన ధారావత్ పుల్యకు విక్రయించాడు. దీంతో పుల్య 2012 వరకు విక్రయ పత్రం ఆధారంగానే భూమిని సాగు చేసుకున్నాడు. 2012లో కొనుగోలు దారుడైన ధారావత్ పుల్యకు మెదక్ రెవెన్యూ అధికారులకు పట్టా చేసి ఇచ్చారు. అదే సంవత్సరం హవేళిఘపూర్కు చెందిన మంగళి సాయిలుకు కూడా అదే భూమిని అధికారులు 2012లోనే పట్టాచేసి ఇచ్చారు. ఒకే సర్వే నంబర్పై ఇరువురికి పట్టా ఇవ్వటంతో ఇరువురు లబ్ధిదారులు గొడవలు పడుతున్నారు. 1984 నుండి ఆ భూమి కొనుగోలు దారుడు దారావత్ పూల్య సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నాడనీ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, మంగళి సాయిలు మాత్రం ఈ భూమి తమ పాలి వాళ్లదనీ, వారికి తనే వారసున్నని పేర్కొంటున్నాడు. ఈ ఘర్షణల నేపథ్యంలోనే ఈఏడాది కూడా ధారావత్ పుల్య సదరు భూమిలో నాటు వేయగా. మంగళి సాయిలు గడ్డిమందును స్ప్రే చేశాడు. దీంతో పంటంతా ఎండిపోయింది. దీంతో పుల్య పోలీసులకు ఫిర్యాదు చేయగా మెదక్ రూరల్ ఎస్ఐ వేణుకుమార్ మంగలి సాయిలుపై కేసు నమోదు చేశారు.
సాయిలుకు సంబంధం లేదు
2012 సంవత్సరంలో ఒకే భూమిని అప్పటి ఎమ్మార్వో ఇరువురికీ పట్టాచేశారు. దీనిపై విచారణ జరపగా మంగళి రాజయ్య వద్ద భూమి కొనుగోలు చేసినట్లు పుల్య వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. సాయిలుకు ఆ భూమికి సంబంధం లేదు. ఈ విషయంపై నెలరోజుల క్రితమే విచారణ జరిపి ఆర్డీఓకు నివేదించాను. ఆదేశాలు వెలువడగానే తగు చర్యలు తీసుకుంటాను.
-పుష్పలత, తహశీల్దార్, మెదక్
రెవెన్యూ అధికారుల లీలలు
Published Tue, Sep 3 2013 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement